ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 28: రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయి షూటింగ్బాల్ పోటీల్లో రాణించాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో తెలంగాణ షూటింగ్ బాల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో షూటింగ్బాల్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని అసోషియేషన్ నూతన అధ్యక్షుడు సాయిని రవికుమార్ చెప్పారు. వచ్చే నెలలో జాతీయ స్థాయి షూటింగ్బాల్ పోటీలను ఆదిలాబాద్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సుమారు 7జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులతో స్టేడియం సందడిగా కనిపించింది. కార్యక్రమంలో అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి సోమ శేఖర్, వివిధ జిల్లాల కార్యదర్శులు, జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు దయానంద్రెడ్డి, డాక్టర్ సుమలత, తదితరులు పాల్గొన్నారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రవికుమార్
షూటింగ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సాయిని రవికుమార్ ఎన్నికయ్యారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సంఘ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అబ్జర్వర్గా ఏపీ రాష్ట్ర కార్యదర్శి జోసఫ్ వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శిగా సోమశేఖర్, కోశాధికారిగా చరణ్, ఉపాధ్యక్షులుగా రామూనాయక్, లాలు, బారె శ్రీధర్, రెఫరీ బోర్డు చైర్మన్గా క్రాంతికుమార్, సభ్యులుగా అఫ్రోజ్, అక్బర్, నాగరాజును ఎన్నుకున్నారు.