స్వాతంత్య్ర సమరయోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు, మూడు తరాల తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రముఖులు కొనియాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న లక్ష్మణ్ కాంస్య విగ్రహానికి అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పూలమాల వేశారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్లో ఆయన విగ్రహానికి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తాపట్నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎదులాపురం,సెప్టెంబర్ 27 : మలిదశ తెలంగాణ పోరాటయోధుడు, క్విట్ ఇండియా పోరాటంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. స్థ్ధానిక కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్లో 107 జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసి బాపూజీ క్విట్ ఇండియా పోరాటంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి అని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి గ్రామానికి చెందిన బాపూజీ సేవలను కలెక్టర్ కొనియాడారు. అంతకుముందు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, డీబీసీడీవో రాజలింగు, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, ఆదిలాబాద్ తాలూకా అధ్యక్షుడు బొమ్మకంటి రమేశ్, పోపా సంఘం జిల్లా అధ్యక్షుడు బేత రమేశ్, ప్రధాన కార్యదర్శి మెట్పెల్లివార్ శ్రీధర్, ఆదిలాబాద్ మండలాధ్యక్షుడు ఏ ఆశన్న, సభ్యులు బోగ శ్రీనివాస్, లక్కేరామ్, శివకుమార్ పాల్గొన్నారు.
కొండా జీవితం స్ఫూర్తిదాయకం
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 27 : కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకమని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో తెలంగాణ హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బాపూజీ అని కొనియాడారు. ఆదిలాబాద్ ముద్దుబిడ్డ స్వర్గీయ కొండా లక్ష్మణ్బాపూజీ స్ఫూర్తితో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు శివప్రసాద్, లోకేశ్వర్రావు, తహసీల్దార్ సుభాష్చందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో..
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహానికి బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రాజేశ్వర్గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ అధికారి నాగారావు, పరిపాలన అధికారి ఖలీద్, సంక్షేమశాఖ అధికారులు యోగేశ్, కావేరి, యాకుబ్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీవో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్రెడ్డి, శ్రీనివాస్, యోగేశ్, భూమన్న, గాయత్రి, అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.