బజార్హత్నూర్, సెప్టెంబర్ 23 : క్రీడాకారులు పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడి అన్నారు. ఆశ్రమ పాఠశాల క్రీడోత్సవాల్లో భాగంగా జాతర్ల గ్రామంలోని మినీస్టేడియంలో క్రీడాపోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి మినీ స్టేడియంలో క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆశ్రమ పాఠశాల క్రీడోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ఎంతో ఆభినందనీయం అని కొనియాడారు.
విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలు ఎంతోగానో ఉపయోగపడుతాయన్నారు. జోనల్స్థాయి పోటీల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారం, టెన్నీకాయిట్తో పాటు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించినట్లు డీడీ దిలీప్ కుమార్ తెలిపారు. విజేతలను అక్టోబర్ 18న వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సరదాగా వారితో వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో నిర్మల్ డీడీ శ్రీనివాస్రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ అధికారి పార్థసారధి, ఏపీవో పీవీటీజీ ఆత్రం భాస్కర్, ఏటీడీవో క్రాంతి కుమార్, హారిక, సౌజన్య, 14పాఠశాలల హెచ్ఎంలు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.