ఉట్నూర్, సెప్టెంబర్ 18 : గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ఆదివాసులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచడంతో పాటు పోడు భూములకు పట్టాలు ఇవ్వడం, గిరిజనబంధు అమలుకు ప్రకటన చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో గిరిజనులు, టీఆర్ఎస్ నాయకులు ధరణి రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ, సెప్టెంబర్ 18 : అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, గిరిజనుల రిజర్వేషన్లు పెంపు, గిరిజన బంధును ప్రవేశపెట్టడం లాంటి వాటిపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం మండల కేంద్రంతో పాటు సోంపల్లి గ్రామంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అశోక్, టీఆర్ఎస్ నాయకులు గంగాధర్, మల్లేశ్, రాజన్న, కృష్ణ, తదితరులు ఉన్నారు.
బోథ్, సెప్టెంబర్ 18 : మండలంలోని పిప్పల్ధరి గ్రామంలో సర్పంచ్ శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో గిరిజనులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భీంరావ్, స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామస్తులు, పటేల్, ఆదివాసీ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, సెప్టెంబర్ 18 : మండల కేంద్రంలోని పాత బస్టాండు సమీపంలో టీఆర్ఎస్ నాయకులు, గిరిజనులు సీఎం కేసీఆర్, కుమ్రం భీం, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం, సర్పంచ్ లావణ్య, యువజన సంఘం మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు సాయన్న, జగదీశ్, విలాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, సెప్టెంబర్ 18 : గిరిజనుల రిజర్వేషన్లు పెంపుపై బంజారా గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు దిలేష్ చౌహాన్, గణేశ్ పాల్గొన్నారు.
తలమడుగు, సెప్టెంబర్ 18 : సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించడంతో మండలంలో టీఆర్ఎస్, గిరిజన సంఘాల నాయకులు సంబురాలు నిర్వహించారు. సుంకిడి గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, అధికార ప్రతినిధి కిరణ్ కుమార్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోక జీవన్ రెడ్డి, నాయకులు ఆశన్న యాదవ్, మగ్గిడి ప్రకాశ్, చంటి, సునీత రెడ్డి, పల్లవి, రాంబాయి, లక్ష్మణ్, పాండు, నర్సింహులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.