భైంసా, సెప్టెంబర్ 18 : బక్కచిక్కుతున్న బాల్యం నుంచి చిన్నారులను రక్షించేందుకు, ఆరోగ్యంగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పోషకాహార లోపంతో పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాన్ని నిర్వహి స్తున్నారు. మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ నెల 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.
చిన్నారులకు తల్లిపాలకు బదులు డబ్బా పాటు తాగిస్తే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకా శం ఉందని వైద్యులు చెబుతున్నారు. డబ్బా పాటు చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు పట్టించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు చిన్నారులకు తల్లిపాలు ఇవ్వాలని సూచిస్తు న్నారు. ఆ తర్వాత చిన్నారులకు అదనంగా పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రసవానికి ముందు తల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే అంశాలపై అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లల ఎత్తు, బరువు ఆధారంగా పెరుగుదలలో లోపాలు ఉంటే వివరాలు పోషన్ ట్రాకర్ అప్లికేషన్లో నమోదు చేస్తున్నారు. దీని ఆధారంగా ఆయా చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తారు. అంగన్వాడీలో విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించి లోపాలున్న కిశోర బాలికలకు ఆరోగ్య శాఖ ద్వారా వైద్యం అందించనున్నారు. ప్రభుత్వం అంది స్తున్న బాలామృతం ప్యాకెట్లను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్నారు.
చిన్నారులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించాలి. ప్రభుత్వం పౌష్టిక లోపం ఉన్న చిన్నారులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా పోషణ్ మాసాన్ని నిర్వహిస్తు న్నాం. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. చిన్నారులు పౌష్టికాహారలోపం బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– సీడీపీవో నాగలక్ష్మి