గిరిజనుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల 10 శాతానికి పెంచడం తోపాటు, గిరిజన బంధు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో ఆదివారం ప్రజాప్ర తినిధులు, ఆదివాసీ, గిరిజన నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వ హిం చారు. ఈ కార్యక్రమం పండుగలా సాగింది.
దస్తురాబాద్, సెప్టెంబర్ 18 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, ఆదివాసీ, గిరిజన నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సింగరి కిషన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సమూచిత న్యాయం కల్పిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆదివాసీ, గిరిజన ప్రజలను గుర్తించిన ప్రపంచంలోనే ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, సర్పంచ్లు నిమ్మతోట రాజమణి, ముష్కే అంజన్న, దుర్గం శంకర్, ఉప సర్పంచ్ వర్ధెల్లి గోపాల్, సిడాం రాజు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాజనర్సయ్య, టౌన్ అధ్యక్షుడు కమలాకర్, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు మేస్త్రం సురేందర్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు మునేసుల శైలేందర్, బొమ్మె న గోపి, ఆదివాసీ, నాయకులు పాల్గొన్నారు.
పెంబి, సెప్టెంబర్ 18 : గిరిజనుల అభివృద్ధే సర్కారు ధ్యేయమని రైతు బంధు సమితి మండల కన్వీనర్ భూక్యా టీకాజీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో గిరిజనులు, నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆదివారం పాలాభి షేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్లు పది శాతానికి పెంచడంతోపాటు గిరిజన బంధు వంటి పథకాలు అమలు చేస్తామని ప్రకటించడం హర్షనీయమన్నారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, సర్పంచ్లు పూర్ణచందర్ గౌడ్, తానా జీ, నాయకులు కున్సోత్ విలాస్, గాండ్ల శంకర్, మతీన్, సోన్న రాజేందర్, విక్రమ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 18 : పట్టణం లోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రేఖానాయక్ పాలాభిషేకం చేశారు. తెలంగాణ గిరిజనులు సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడు రుణపడి ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్, పీఏసీఎస్, ఏఎంసీ మాజీ చైర్మన్లు అంకం రాజేందర్, శ్రీనివాస్, శంకర్, ఎంపీపీ మొయీద్, కౌన్సిలర్లు సంతోష్, శ్రీనివా స్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాజగంగన్న, చరణ్, మాజీ జడ్పీటీసీ రాము నాయక్, నాయకులు సురేశ్, నగేశ్, మెహ్రజ్ తదితరులు పాల్గొన్నారు.