ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు విజయవంతమయ్యాయి. మొదటి రోజు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించగా.. రెండో రోజూ జాతీయ జెండాలు ఎగురవేశారు. మూడో రోజైన ఆదివారం స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులను సన్మానించారు. నిర్మల్ పట్టణంలోని దివ్యగార్డెన్లో వేడుకలు జరుగగా.. మంత్రి అల్లోల జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలో ముగింపు వేడుకలు జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయగా.. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, అదనపు కలెక్టర్లు జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ వీరుల పోరాట స్ఫూర్తిని కండ్లకు కట్టినట్లు విద్యార్థులకు నాటికల రూపంలో ప్రదర్శించారు.
నిర్మల్ అర్బన్, సెఫ్టెంబర్18 : నిర్మల్లోని దివ్యగార్డెన్లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు విజయవంత మయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులను సన్మానించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారం భించా రు. ఈ సందర్భంగా కళాకారులు చేసిన గుస్సాడీ, చిందు, యక్షగానం, దేశభక్తి గేయాలు, నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. నాటికలను విద్యార్థులు ప్రద ర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో కళలకు విడదీయరాని బంధం ఉందని, ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో కళలు మమేకమయ్యాయని పేర్కొన్నారు.
జిల్లా ల్లో మూడు రోజుల నుంచి చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారని తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని వర్గాల వారు భాగస్వాము లయ్యారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయో ధులు ఆకుల భోజమ్మ, జుట్టు లక్ష్మీనారాయణ, ముడు సు సత్యనారాయణను మంత్రి, కలెక్టర్ ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, ఎంపీపీ రామేశ్వ ర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారు గొండ రాము తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, సెప్టెంబర్ 18 : జిల్లాలో తెలం గాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు విజయ వంతమయ్యాయని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం జడ్పీ సమావేశ మంది రంలో సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన నిర్వ హించారు. స్వాతంత్య్ర సమరయోధులు, వివిధ గ్రామాల్లో జానపద కళాకారులకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమా నికి ముందుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్, శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజ జ్యోతి ప్రజ్వలన చేశారు.
దేశ భక్తి, తెలంగాణ గేయాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. తెలంగా ణ పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టినట్లు నాటికలు ప్రదర్శించారు. అలాగే చిన్నారుల భరతనాట్యం, లంబాడీ నృత్యం అలరించాయి. అనంతరం 112 మంది కవులు, కళాకారులు, ముగ్గురు స్వాతం త్య్ర సమరయోధులను శాలువాలతో సన్మానిం చారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఆర్డీవో రాథోడ్ రామేశ్, డీఆర్డీఏ కిషన్, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే, డీఈవో ప్రణీత, డీవైఎ స్వో వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, పరిశ్రమ శాఖ అధికారి నాగభూషణం, డీపీఆర్వో భీమ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారులు రాజ లింగు, సునీత, కృష్ణవేణి తదితరులు ఉన్నారు.