ఎదులాపురం, సెప్టెంబర్ 17 : ఆదిలాబాద్ జిల్లాలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఓఎస్డీ శ్రీనివాస్, సీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ ముఖ్య కార్యాలయంలో..
క్యాంపు, జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిబ్బందికి, అందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ వెంకటి, పరిపాలన అధికారి యూనిస్ అలీ, సీసీ దుర్గం శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐ కృష్ణమూర్తి, ఎస్ఐలు, సిబ్బంది, తదితరుల పాల్గొన్నారు.
అటవీ శాఖ ..
జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అధికారి రాజశేఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో బీ గులాబ్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ..
మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జోగు ప్రేమేందర్ జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పులమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు , కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కోర్టులో..
జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్లో న్యాయముర్తులు, సభ్యులు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి మధవికృష్ణ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో న్యాయముర్తులు సతీశ్కుమార్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్పాండే, ప్రమీలజైన్, యశ్వంత్సింగ్ చౌహాన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రల నగేశ్, న్యాయవాదులు పాల్గొన్నారు.
బేలలో..
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా మండల పరిషత్లో ఎంపీపీ వనిత ఠాక్రే, బేల గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఇంద్రశేఖర్, అటవీ శాఖలో ఎఫ్ఆర్వో అరుణ, గ్రామ పంచాయతీ, వివిధ కార్యాలయాల్లో అధికారులు, సర్పంచ్లు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, ప్రమోద్ రెడ్డి, జక్కుల మధుకర్, సుదర్శన్, మంగేశ్ ఠాక్రే, దేవన్న పాల్గొన్నారు.
బోథ్ మండలంలో..
మండలంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ అతిఖొద్దీన్, మండల పరిషత్లో సూపరింటెండెంట్ దుర్గం రాజేశ్వర్, పోలీస్ స్టేషన్లో సీఐ ముదావత్ నైలు, ఐసీడీఎస్లో సీడీపీవో సౌందర్య, కోర్టులో న్యాయమూర్తి బీ హుస్సేన్, మార్కెట్ కమిటీలో చైర్మన్ దావుల భోజన్న, సీహెచ్సీలో డాక్టర్ రవీంద్రప్రసాద్, మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ ఉమేశ్రావు, కేజీబీవీలో ప్రత్యేకాధికారిణి వలిత, గురుకుల పాఠశాలో ప్రిన్సిపాల్ స్వర్ణలత, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శంకర్, సొనాల పీహెచ్సీలో డాక్టర్ కుంట నవీన్రెడ్డి, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, యువజన సంఘాల భవనాలలో యూత్ల అధ్యక్షులు, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు మువ్వన్నెల జెండా ఎగురవేశారు.
ఇచ్చోడలో..
మండలంలోని ప్రభుత్వ కార్యాలయల్లో అధికారులు, గ్రామ పంచాయతీ కార్యాలయల్లో సర్పంచ్లు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో డివిజన్ ఫారెస్ట్ అధికారి బర్నోబా, ఎఫ్ఆర్వో పాండురంగ్, శంకరయ్య, నౌసిలాల్, సర్పంచ్లు, పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో..
ఆదిలాబాద్ టౌన్, సెప్టెంబర్ 17 : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గండ్రత్ రమేశ్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ శివరాజ్, ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శివలాల్, శంకర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్లో..
మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సంధ్యారాణి, మండల పరిషత్లో ఎంపీడీవో సునీత, మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, సెప్టెంబర్ 17 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ పవన్చంద్ర, మండల పరిషత్లో ఎండీడీవో అబ్దుల్సమద్, వ్యవసాయ శాఖలో ఏవో భాస్కర్, పీహెచ్సీలో డాక్టర్ లావణ్య, పశువైద్య కేంద్రంలో డాక్టర్ సుశీల్కుమార్, నేరడిగొండ, కుమారి పీఏసీఎస్లో చైర్మన్లు సాబ్లె కిశోర్సింగ్, మందుల రమేశ్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శబానా తరన్నం, సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ రాజ్కిరణ్రెడ్డి, ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో భూమారెడ్డి, మండలంలోని గ్రామ పంచాయతీల వద్ద సర్పంచ్లు, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
భీంపూర్ మండల పరిషత్లో ఇన్చార్జి ఎంపీపీ గడ్డం లస్మన్న , తహసీల్లో తహసీల్దార్ మహేంద్రనాథ్, పీఎస్లో ఎస్ఐ రాధిక జాతీయ జెండా ఎగురవేశారు. 26 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయలు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ , ఎంపీడీవో శ్రీనివాస్ , వైద్యాధికారి విజయసారథి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మండల కేంద్రంతో పాటు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సురేశ్, తహసీల్దార్ సర్ఫరాజ్, ఎస్ఐ నీరేశ్, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ, నిశికాంత్ పాల్గొన్నారు.
మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు, గ్రామ పంచాయతీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగురవేశారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సోము, ఎంపీడీవో పుష్పలత, జడ్పీటీసీ పుష్పలత, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్సింగ్, డీసీసీబీ మేనేజర్ మెస్రం కోసేరావ్, ఎస్ఐ సునీల్, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఉపసర్పంచ్ గణేశ్, ప్రధానోపాధ్యాయులు గోపాల్సింగ్తిలావత్, నాయకులు రాజలింగు, ఖమ్ము, పాల్గొన్నారు.
గాదిగూడ, నార్నూర్ మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, మండల పరిషత్లో ఎంపీడీవో రమాకాంత్, పీఏసీఎస్లో చైర్మన్ దామోదర్ రెడ్డి జాతీయ జెండాఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్యాణం లక్ష్మి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోక జీవన్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.