ఎదులాపురం, సెప్టెంబర్ 17 : బ్యాంకు, రుణ గ్రహీతలు పరస్పర అంగీకారంతో రుణ కేసులు పరిష్కరించుకోవాలని ఆదిలాబాద్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి మాధవి కృష్ణ అన్నారు. జిల్లా కోర్టులోని డీఎల్ఎస్ఏ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం బ్యాంకు లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ బ్యాంకర్లు, రుణగ్రహీతలు ఇరువురు ఇబ్బందులు లేకుండా కేసులు పరిష్కరించుకో వాలన్నారు. న్యాయముర్తులు సతీశ్కుమార్, డీఎల్ ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే, ప్రమీలాజైన్, మం జుల, యశ్వంత్సింగ్ చౌహాన్, పీపీ రమణారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రల నగేశ్, రుణగ్రహీతులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి
బ్యాంకుల్లో రుణాలు తీసుకొని చెల్లించకుండా పెండింగ్లో ఉన్న ఖాతాదారులు బ్యాంకు లోక్ అదాలత్ను వినియోగించుకొని పరిష్కరించుకోవచ్చని బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బీ హుస్సేన్ అన్నారు. శనివారం కోర్టులో బ్యాంకు లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ బోథ్ బ్యాంకులకు సంబంధించినటువంటి 10 కేసుల్లో రూ 4.40 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. లీగల్ సర్వీసెస్ సిబ్బంది శశికళ, మేనేజర్లు పాల్గొన్నారు.
నిర్మల్లో..
వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రుణగ్రహీతలు కోర్టు సేవలు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి అజేశ్ కుమార్ అన్నారు. నిర్మల్లోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో బ్యాం కు లోక్ అదాలత్ నిర్వహించారు. 13 కేసుల్లో రూ.4,70,000 రికవరీ అయినట్లు తెలిపారు. లోక్ అదాలత్ సభ్యులు రాజలింగం, లింగయ్య, బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.