నిర్మల్ టౌన్/ఎదులాపురం, సెప్టెంబర్ 14 : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వజ్రోత్సవాల నిర్వహణపై బుధ వారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీని ఘనంగా నిర్వహించాలని తెలిపారు.
ర్యాలీకి వచ్చే ప్రజలకు భోజన వసతిని, ఇతర సౌకర్యాలు కల్పించాల లని సూచించారు. 17న జిల్లా కేంద్రంలో జాతీ య పతాకాన్ని ఆవిష్కరించాలని, 18న సాంస్కృ తిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. మొదటి రోజు అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించ నున్న ర్యాలీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు 15వేల మంది పాల్గొనేలా చూడాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వా ములు చేయాలని కోరారు. ఆయా చోట్ల నిర్మల్ అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, నిర్మల్ ఎస్పీ ప్రవీణ్కుమార్, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఆదిలాబాద్ అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, అదనపు ఎస్పీ శ్రీనివా స్రావు, ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, అధికారులు పాల్గొన్నారు.