ఎదులాపురం, నవంబర్9: రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రిజర్వేషన్ల వారీగా మద్యం దుకాణాలు కేటాయిస్తున్నది. ఇందులో భాగంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం రిజర్వేషన్ల వారీగా డ్రా తీసి మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ నెల 30తో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగియనున్నది. వచ్చేనెల నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానున్నది. దీంతో మద్యం దుకాణాల టెండర్ల కు ఈ నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రా రం భమైంది. 18 వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
జిల్లాలో 40 మద్యం దుకాణాలు
ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాలో 31 మద్యం షాపులు ఉండగా, కొత్తగా 9 షాపుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. మొత్తంగా జిల్లాలో 40 దుకాణాలను కేటాయించారు. 25 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో, 9 దుకాణాలు ఎస్టీలకు, 5దుకాణాలు ఎస్సీలకు, ఒక దుకాణం గౌడ కులస్తులకు కేటాయించారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన అబ్కారీ విధానాన్ని వచ్చే నెల నుంచి అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు టెండర్ల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో 1,2 కౌంటర్లలో ఆదిలాబాద్, మూడో కౌంటర్లో ఇచ్చోడ, నాలుగో కౌంటర్లో ఉట్నూర్కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఈ ఏడాది కొత్తగా 9 షాపులు మంజూరు చేశారు. ఆదిలాబాద్ సర్కిల్ పరిధిలో భోరజ్, భీంపూర్, తలమడుగు, మార్కెట్యార్డు సమీపంలో ఒక్కొక్కటిగా కేటాయించారు. ఇచ్చొడ సర్కిల్ పరిధిలో మన్నూర్, సిరికొండ, నేరడిగొండలో ఒక్కొక్కటి కేటాయించారు. ఉట్నూర్ సర్కిల్ పరిధిలో లక్కారం, లోకారిలో ఒక్కొక్కటి చొప్పున నూతనంగా షాపులు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ సీఐ సీహెచ్ శ్రీనివాస్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్లు కేటాయించిన షాపులకు స్థానికులకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులు తమ ధ్రువీరకణ పత్రాలు, పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తదితర వాటిని దరఖాస్తు ఫారంతో చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 20న జిల్లా కేంద్రంలోని తానీషా గార్డెన్లో ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా ఉంటుందన్నారు. సమావేశంలో ఎస్ఐలు అరుణ్ కుమార్, రాజేశ్వర్, సంజయ్ ఉన్నారు.