ఎదులాపురం,ఆగస్టు 13: భారత్ మాతా కీ జై నినాదాలతో ఆదిలాబాద్ జిల్లా హోరెత్తింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. శనివారం వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం ర్యాలీని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్చౌక్ నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడారు. ఫ్రీడం ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. పోలీస్, జిల్లా యంత్రాంగం సమన్వయం తో పట్టణ ప్రజలు, యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ నెల 22 వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించనున్న వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం బోథ్, ఆదిలాబాద్ నియోజక వర్గాల్లో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించన్నుట్లు తెలిపారు.
ఈనెల 15 వరకు నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పోలీస్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని విజయవం తం చేసిన ప్రతి ఒక్కరికీ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు అన్ని వర్గాల నుంచి మంచి స్పం దన వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ నెల 16 న నిర్వహించనున్న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం త్రివర్ణ రంగుల బెలూన్లను ఆకాశంలోకి ఎగురువేశారు. పటాకులు కాల్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ ఉమేందర్, జిల్లా అధికారులు సునీత, కిషన్, శంకర్, కృష్ణవేణి, డీఈవో ప్రణీత, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సీఐలు మల్లేశ్, సురేందర్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
నార్నూర్లో..
నార్నూర్,ఆగస్టు 13: వజ్రోత్సవాల్లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో చేపట్టిన ఫ్రీడం ర్యాలీని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ నుంచి ఆదర్శనగర్ వరకు త్రివర్ణ పతాకాలతో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 22 వరకు వజ్రోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎం పీపీ కనక మోతుబాయి, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, నార్నూర్ సీఐ ప్రేమ్కుమార్, ఎంపీడీవో రమేశ్, తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్, సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, ఏపీవో రాథోడ్ సురేందర్, ఎంపీటీసీ పరమేశ్వర్, విద్యావేత్త బాలాజీ కాంబ్లే ఉన్నారు.
గాదిగూడలో..
గాదిగూడలో నిర్వహించిన ర్యాలీలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆయాశాఖల అధికారులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. ఆశ్రమోన్నత బాలుర పాఠశాల నుంచి కుమ్రం భీం చౌరస్తా వరకు జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆడ చంద్రకళ రాజేశ్వర్, వైస్ ఎంపీపీ మర్సివనే యోగేశ్, ఎంపీడీవో రామేశ్వర్, తహసీల్దార్ ఆర్కా మోతీరామ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.