జన్నారం, ఆగస్టు 13 : మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో మార్కెట్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్గా సీపతి పద్మ, వైస్ చైర్మన్ గోట్ల రాజేశ్ యాదవ్, మరో 16మంది డైరెక్టర్లను జిల్లా మార్కెట్ కమిటీ మేనేజర్ గజానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. మార్కెట్ కమిటీ ఏర్పడిన నాటి నుంచి చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వివరించారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి ఆగస్టు 20 నుంచి సాగు నీటి నీటిని అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సీపతి బుచ్చన్న, ముత్యం సతీశ్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్కుమార్, పొనకల్ సింగిల్ విండో చైర్మన్ శీలం రమేశ్, డైరెక్టర్లు సిటిమల్ల భరత్కుమార్, జక్కు భూమేశ్, ఎంఏ రజాక్, అన్నె కాంతమణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జన్నారంలోని నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ప్రారంభించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో గల ప్రభుత్వ భూమిలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం భూమిపూజ చేసి రూ.5 లక్షల నిధులను మంజూరు చేశారు.