ఆదిలాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1509 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 468, నిర్మల్ జిల్లాలో 396, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 334, మంచిర్యాల జిల్లాలో 311 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తెలంగాన ప్రభుత్వం పల్లెల అభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలకు కొత్తరూపు వచ్చింది. గతంలో చెత్తాచెదారంతో నిండిపోయి, డ్రైనేజీల కంపుతో అధ్వానంగా ఉన్న పల్లెలు పల్లెప్రగతితో ఇప్పుడు ఎక్క డా చూసిన వీధులు, మురుగు కాల్వలు శుభ్రం గా కనపడుతున్నాయి. అదేవిధంగా గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరుస్తోంది.
గ్రామస్తులు ఎవరైనా చనిపోతే దహనసంస్కారాలు నిర్వహించేందుకు స్థలాలు సరిగా లేకపోగా శ్మశాన వాటికల నిర్మాణాలతో సమస్యకు పరిష్కారం లభించింది. పల్లెపార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కంపోస్ట్ షెడ్ల్లో పంచాయతీల ఆధ్వర్యంలో ఎరువులు తయారు చేస్తున్నారు. గతంలో ని ధులు కొరత కారణంగా పంచాయతీల నిర్వహ ణ భారంగా మారింది. అయితే తెలంగాణ ప్రభు త్వం ప్రతి నెల పంచాయతీలకు నిధులు మం జూరు చేస్తున్నది. ట్రాక్టర్ల ద్వారా రోజు సేకరించిన చెత్తనుంచి పంచాయతీ సిబ్బంది సేంద్రియ ఎరువులను తయారు చేసి విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ట్యాంకర్ల ద్వారా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను నీరు అందిస్తుండడంతో పంచాయతీలకు డబ్బులు వస్తున్నాయి.
గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు
పల్లె ప్రగతిలో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు విడుతలుగా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. గతంలో ఆపరిశుభ్రంగా, కం పుతో ఉండే పలు గ్రామాలు శుభ్రంగా మారా యి. పచ్చదనంలో భాగంగా నాటిన మొక్కలు పెరుగుతుండడంతో పల్లెలు పచ్చలహారాన్ని సంతరించుకున్నాయి. ప్రతి గ్రామంలో వైకుంఠధామానికి ఉపాధిహామీ కింద రూ.10.50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. పలు పంచాయతీలు స్వయంగా నిధులు సమకూర్చుకొని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కంపోస్ట్ షెడ్ నిర్మాణానికి రూ. 2.5 లక్షలు కేటాయిస్తున్నారు. పల్లె ప్రకృతి వనాల్లో స్థానికులు సేదతీరుతున్నారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు నుంచి 10 శాతం పచ్చదనం కోసం వెచ్చిస్తున్నారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ప్రతి పంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేశారు.
పుష్కలంగా నిధులు..
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పంచాయతీలకు ఆర్థిక సం ఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుండగా, నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమవుతున్నాయి. గ్రామాలకు జనాభా ప్రాతిపదికన నిధులు మంజూరవుతున్నాయి. ఒక్కో పౌరుడికి ఏడాదికి రూ.1632 చొప్పున నిధులను మంజూరు చేస్తుండగా, ప్రతి నెల ఒక్కొక్కరికీ రూ.132 చొప్పున ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇస్తున్నది. గ్రామ పంచాయతీల పునర్విభజనతో పాటు పంచాయతీరాజ్ కొత్త చట్టం పకడ్బందీగా అమలయ్యేందుకు వీలుగా ఈ శాఖను బలోపేతం చేశారు. ప్రతి మండలానికి ఎంపీవో, ప్రతి పంచాయతీకి కార్యదర్శులను నియమించారు. వారు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సఫాయి కార్మికుల వేతనాన్ని ప్రభుత్వం పెంచింది.
పకడ్బందీ పర్యవేక్షణ..
పల్లె ప్రగతిలో భాగంగా జరిగే పనులను పర్యవేక్షించడానికి ప్రభుత్వం రెండు యాప్లను తీసుకువచ్చింది. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులు, అబ్జర్వర్లకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇచ్చింది. పల్లెల్లో జరుగుతున్న పనులను యాప్లో నమోదు చేసుకోవాలి. వీటిని మండల స్థాయిలో ఎంపీడీవోలు, డివిజన్ స్థాయిలో డీఎల్పీవోలు, జిల్లా స్థాయిలో డీపీవోలు పర్యవేక్షిస్తారు. ఈ యాప్లో రోజువారీ పనులు నమోదు చేయాలి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయడం, వీధి దీపాల నిర్వహణ, ఇండ్ల నుంచి వ్యర్థాలను తీసుకుపోవడం, మంచి నీటి ట్యాంకులను శుభ్రం చేయడం, పంచాయతీ ఫైళ్ల నిర్వహణ, సర్టిఫికెట్లు, జనన, మరణ రిజిస్ట్రేషన్లు, పంచాయతీ ఆదాయం, ఖర్చు, చెక్కులు, వేతనాల రసీదులు ఎప్పుటికప్పుడు యాప్లో నమోదు చేయాలి.