ఆసిఫాబాద్, ఆగస్టు 13 : స్వాతంత్య్ర సమర యోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పోలీసులు, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ జిల్లా కేంద్రంలో గురుకుల పాఠశాల నుంచి ఫ్రీడమ్ బైక్ ర్యాలీని ప్రారంభించారు. జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ రాహుల్రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఎస్పీ సురేశ్ కుమార్, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్బాజ్పాయి, డీఎఫ్వో దినేశ్కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ప్రజలందరూ ముందుకు వచ్చి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీంరావు, డీఎస్పీ శ్రీనివాస్, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవేణి మల్లేశ్, సింగిల్విండో చైర్మన్ అలీబిన్హైమద్, ఏఎంసీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, నాయకులు అబ్దుల్లా, హైమద్, రవి, సాలం, జావిద్, భీమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి మండలంలో..
బెల్లంపల్లి, ఆగస్టు 13 : స్వాతంత్య్ర ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ చాటి చెప్పాలని అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో శనివారం 25వేల మందితో జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. 120 మీటర్ల జాతీయ జెండాతో మహా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాధించిన ప్రగతిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి స్వచ్ఛంద సేవా సంస్థలు పులిహోర, మజ్జిగ, తాగునీరును అందించారు.
ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీడియో చిత్రీకరించారు. అనంతరం రికార్డులో చోటు సంపాదించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, ఆర్డీవో శ్యామలాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, సీఐలు ముష్కేరాజు, బాబురావు, జగదీశ్, తహసీల్దార్ కుమారస్వామి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, వివిధ విభాగాల అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, ఇతర కుల సంఘాలు, పాఠశాల విద్యార్థులు, యువకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
మంచిర్యాలలో ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే
మంచిర్యాలటౌన్, ఆగస్టు 13: మంచిర్యాల పట్టణంలోని ఐబీ నుంచి ర్యాలీని కలెక్టర్ భారతీ హోళికేరి, ఎమ్మెల్యే దివాకర్రావు, డీసీపీ అఖిల్ మహాజన్, డీఎఫ్వో శివాని డోంగ్రే పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. జడ్పీ బాలుర పాఠశాల మైదానానికి చేరుకున్న తరువాత మూడు రంగుల బెలూన్లను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ నారాయణ నాయక్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు విజిత్రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, విద్యార్థులు, పాఠశాల, కళాశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.
మంత్రికి స్వాగతం పలికిన నాయకులు
వజ్రోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్కు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు స్వాగతం పలికారు. ఆసిఫాబాద్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరుగుప్రయాణంలో మంచిర్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వారికి శనివారం సాయంత్రం ఎమ్మెల్యేతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. పార్టీ పటిష్టతకు కృషిచేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేశ్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భూమేశ్, టీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు గరిగంటి సరోజ, నాయకులు బుద్దార్థి రాంచందర్, చంద్రశేఖర్ హండే, రవీందర్రావు, కౌన్సిలర్లు ప్రకాశ్నాయక్, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
కాగజ్నగర్ పట్టణంలో..
కాగజ్నగర్ టౌన్, ఆగస్టు 13: పట్టణంలోని 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆయా పాఠశాలల ఆధ్వర్యంలో త్రివర్ణ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ర్యాలీని ప్రారంభించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం పట్టణ వీధుల గుండా జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, పట్టణ ఎస్హెచ్వో రవీందర్, తహసీల్దా ప్రమోద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట పట్టణంలో ముస్లింల ర్యాలీ..
లక్షెట్టిపేట, ఆగస్టు13 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా పట్టణంలో శనివారం ముస్లిం మైనార్టీలు ర్యాలీ తీశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షాహెద్ ఆలీ, చాంద్, సజ్జు, అన్వర్, మున్న, గఫూర్, బాజీ, షాబొద్దీన్, నయీంతోపాటు పెద్ద సంఖ్యలో ముస్లింలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.