కాగజ్నగర్టౌన్, ఆగస్టు 13: నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న నిత్యాన్నదానం ఎంతో గొప్పదని తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం కాగజ్నగర్లోని కోనేరు కోనప్ప నిత్యన్నదాన సత్రం ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. పలు గ్రామాల నుంచి నియోజకవర్గ కేంద్రానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజల ఆకలి తీర్చడం అభినందనీయమన్నారు. మరిన్ని సేవా కార్య క్రమాలను కొనసాగించాలని సూచించారు. అంతకు ముందు సత్రంలో నిర్వహించిన శ్రీనివాస కల్యాణంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం అదృష్టమని, దాతల సహాయ సహకారాలతో నిత్యాన్నదానం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం మంత్రితో పాటు ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, దివాకర్రావు, ఆత్రం సక్కులతో కలిసి భోజనం చేశారు. అనంతరం వీరిని శాలువాలతో ఎమ్మెల్యే దంపతులు సన్మానించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు, పీవో వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్ చాహత్బాజ్పాయ్ , జిల్లా ఎస్పీ సురేశ్, నిత్యాన్నదాన సత్రంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ, సాంబశివరావు, నాగేశ్వర్రావు, డీఎస్పీ కరుణాకర్, ఎస్హెచ్వో రవీందర్, తహసీల్దార్ ప్రమోద్, ఎఫ్డీవో విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కాసం శ్రీనివాస్, డాక్టర్ దామోదర్రావు, వేదపండితులు అజయ దీరసింహ ఆచార్య, కౌస్తుభా ప్రతాప్, అనిల్, ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.