సోన్, ఆగస్టు 11 : అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలలోని సాకెర గ్రామానికి చెందిన సాకాని సువర్ణ లక్ష్మీ గంగారాం జ్ఞాపకార్థం వారి కూతురు, అల్లుడు భవాని శంకర్ గ్రామ స్వాగత తోరణ నిర్మాణానికి రూ.8లక్షలు విరాళం ఇవ్వగా.. గురువారం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఉన్నతస్థానాలకు ఎదిగిన ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భవాని, శంకర్ను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్రెడ్డి, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, సోన్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, సర్పంచ్ సుంచు సుప్రజా శ్రీనివాస్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, టీ.వినోద్, ఎల్చల్ గంగారెడ్డి, దాసరి రాజేశ్వర్ పాల్గొన్నారు.