మందమర్రి రూరల్, ఆగస్టు 11 : రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారుదామని మందమర్రి ఏరి యా ఇన్చార్జి జీఎం ఎం. వెంకటేశ్వర్లు పిలుపుని చ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక ఎంవీటీసీలో గురువారం రక్త దా న శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి జీఎం మాట్లాడుతూ మందమర్రి ఎంవీటీసీ కార్యాలయంలో ఇప్పటివరకు 31సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సేకరించిన రక్త నిధిని రెడ్ క్రాస్ సొసైటీకి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడ సేకరించిన రక్తనిధి తలసేమియా వ్యాధిగ్రస్తులతో పాటు నిరుపేద గర్భిణులకు, కిడ్నీ వ్యాధులతో బాధపడే వా రికి ఎంతో ప్రయోజనకరంగా మారిందన్నారు. సంస్థ ఉత్పత్తితో పాటు పలు సేవా కార్యక్రమాల ను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఎస్వోటూ జీఎం కృష్ణారావు, ఏఎస్వో ఓదెలు, ఐఈడీ డీజీఎం రా జన్న, ఇన్చార్జి పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఎంవీటీసీ మేనజర్ శంకర్, సీనియర్ పీవోలు మై త్రేయ బంధు, సత్యబోసు, ట్రైనింగ్ ఆఫీసర్ అశో క్ కుమార్, ఐటీ ప్రోగ్రామర్ రవి, రెడ్ క్రాస్ స భ్యులు కాసర్ల శ్రీనివాస్, రంజిత్ పాల్గొన్నారు.