తాంసి, ఆగస్టు 10 : స్వతంత్ర భారత వజ్రో త్సవాలను విజయవంతం చేయాలని ఆదిలా బాద్ కలెక్టర్ సిక్తా పట్నా యక్ కోరారు. తాంసి మండలం పొన్నారిలో బుధవారం ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కును ప్రజాప్రతినిధులు, అధి కారులతో ఆమె కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా జాతీయ జెండాలను ప్రదర్శించి, స్థానికు లకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. 14వ తేదీ వరకు ఇంటింటికీ జెండాలను పంపిణీ చేయాలని, 22 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అంతకు ముందు జడ్పీటీసీ తాటి పెల్లి రాజు జిల్లా కలెక్టర్కు మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఆర్డీఏ కిషన్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో ఆకుల భూమ య్య, ఎంపీవో సుధీర్రెడ్డి, ఎంపీటీసీ ముచ్చ రేఖ, ఉప సర్పంచ్ అశోక్, పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, తధితరులున్నారు.
మావలలో..
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 10 : మావలలో ఫ్రీడం పార్కును ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నా యక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వజ్రోత్సవాల సందర్భంగా పట్టణం లోని అన్ని థియేటర్లలోనూ గాంధీ సినిమాను ప్రతి రోజు విద్యార్థుల కోసం ప్రదర్శిస్తారని పేర్కొ న్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేసేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్రీడం పార్కుల ఏర్పాటుతో పాటు ప్రతి గ్రామంలో 75 మొక్కలు నాటి సంరక్షించే బృహత్తర కార్యక్రమాన్ని చేపడు తున్నామని పేర్కొన్నారు. గురువారం ఉదయం 6.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు, మండల కేంద్రాల్లోనూ 2కే ఫ్రీడం ర్యాలీలు జరుగు తా యని, దీనికి యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాల ని ఆమె కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, పంచాయతీ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నరు.