ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి జనసంద్రమైంది. రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే మొహర్రం వేడుకలు వైభవంగా సాగాయి. హస్సేన్-హుస్సేన్ ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిం చారు. పీరీల వద్ద మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం తెల్లవారు జామున పీరీలను నిమజ్జనం చేయడంతో వేడుకలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
తలమడుగు, ఆగస్టు 9 : మొహర్రం సందర్భంగా మండలంలోని రుయ్యాడి గ్రామం మంగళవారం జనసంద్రంగా మారింది. రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా రుయ్యాడిలో మొహర్రం ఉత్సవాలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి హస్సేన్ హుస్సేన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పీరీలను నుంచి వచ్చే అక్షింతలు,పూలు తదితర వాటిని ఒడిలో పట్టుకున్నారు. పీరీలతో గ్రామంలో రోజంతా శోభాయాత్ర నిర్వహించారు. హస్సేన్ హుస్సేన్ ఆలయం ముందు అగ్ని గుండంలో పీరీలను ఆడించారు. వేషధారణలు, భక్తుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గ్రామాని చెందిన గోక రాంరెడ్డి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
జిల్లాతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న పీరీలను దర్శించుకు న్నారు. బుధవారం తెల్లవారు జామున పీరీల నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రుయ్యాడితో పాటు తలమడుగు, కుచులపూర్, సుంకిడి, దేవాపూర్, కజ్జర్ల తదితర గ్రామాల్లో మొహర్రం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.