బాసర, ఆగస్టు 2 : విద్యార్థులు కమ్యూని కేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని ఇన్చార్జి వీసీ వెంకటరమణ అన్నారు. బాసర ట్రిపుల్ఐటీలో ప్లేస్మెంట్ విభాగం ఆధ్వర్యంలో 2022-23 విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. డైరెక్టర్ సతీశ్కుమార్తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ట్రిపుల్ఐటీలో కల్పిస్తున్న శిక్షణ మెళకువలను, సమాచార నైపుణ్యాలతో పాటు వనరులను ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని సాం కేతికత ఆధారం గా నైపుణ్యం కలిగి ఉండడం వలన విద్యాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ ఏడాది యూనివర్సిటీ నుంచి చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు వారిని అభినందించారు. అనంతరం డైరెక్టర్ సతీశ్కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగాల సాధనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పా టు పలు కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరుకావాలని, ఇంటర్వ్యూల సంసిద్ధత, కార్పొరేట్ స్థాయిలో తట్టుకునేలా తమను తాము ఎలా తీర్చిదిద్దుకోవాలనే అంశాన్ని విద్యార్థులకు తెలియజేశారు.
ప్లేస్మెం ట్ విధానం, ప్లేస్మెంట్ పోర్టల్లో నమోదు, ప్లేస్మెంట్ కార్యకలాపాల సమయంలో చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు, చేయకూడని పనుల గురించి ప్లేస్మెంట్ కోఆర్టినేటర్ రాధాకృష్ణ ఓరియంటేషన్ ప్రోగ్రాం ద్వారా తెలియజేశారు. కార్యక్రమం లో ప్లేస్మెంట్ ఇన్చార్జి రాకేశ్ రోషన్, ప్లేస్మెంట్ ఆఫీసర్ హరిబాబు, అసోసియేట్ డీన్ లు, వివిధ విభాగాల హెచ్వోడీలు, ప్లేస్మెం ట్ కోఆర్డినేటర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
తరగతి గదులను పరీక్షించిన వీసీ..
ట్రిపుల్ఐటీలోని ఏబీఐ బ్లాక్లోని తరగతి గదులను ఇన్చార్జి వీసీ వెంకటరమణ పరిశీలించారు. విద్యార్థులతో మచ్చటించి క్లాసులు జరుగుతు న్న తీరును గమనించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు వెలికి తీసేందుకు ప్రతి బ్రాంచ్ నుంచి పది మంది విద్యార్థులను ఇండస్ట్రీయల్ టూర్కు పంపిస్తామని, తద్వారా ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య ను పొందేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట డైరెక్టర్ సతీశ్కుమార్ ఉన్నారు.