దస్తురాబాద్, ఆగస్టు 2 : మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రం వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని మున్యాల, రేవోజిపేట, గొడిసేర్యాల, రాంపూర్ తదితర గ్రామాల్లో వేడుకలను నిర్వహించి పీరీలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి. ప్రతిష్ఠించిన పీరీలను 7వ రోజున డప్పుచప్పుళ్లతో గ్రామంలో ఊరేగించనున్నారు. మొక్కులను చెల్లించుకునేందుకు వీలుగా పీరీలతో ప్రతి ఇంటికీ వెళ్లి మడుపులను కట్టిస్తారు. 9వ రోజు హిందూ ముస్లింలు ప్రత్యేక పూజలు చేసి ముడుపు విప్పి మొక్కులను చెల్లిస్తారు. పీరీల నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయి.