సోన్, ఆగస్టు 1 : భారీ వర్షాలతో ఎస్సారెస్పీ నిండిందని, రైతులు వరి నాట్లు త్వరగా పూర్తిచేసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఎస్సారెస్పీ నుంచి సోన్ మండలం గాంధీనగర్ గ్రామం వద్ద గల సరస్వతీ కెనాల్ ద్వారా సోమవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సరస్వతీ కాలువ ఆయకట్టు, నిర్మల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ఖానాపూర్ సదర్మాట్ ప్యాకేజీ వరకు ఈ నీళ్లు వెళ్తున్నాయన్నారు. 20-25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికే అందరి ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమచేసిందన్నారు. అంతకుముందు గోదావరికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ సోన్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, సర్పంచ్ కే మమతాఎల్లన్న, నాయకులు తిరుక్కోవెల వినోద్కుమార్, ఎల్చల్ గంగారెడ్డి, వెంకయిగారి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
నిర్మల్ అర్బన్, ఆగస్టు 1 : జిల్లా కేంద్రంలోని ఈద్గాం, సిద్ధాపూర్, ఆదర్శనగర్, రాంనగర్ ప్రాంతాల వైకుంఠధామంలో దుకాణా సముదాయాల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, పాకాల రాంచందర్, కౌన్సిలర్ నామెడ రమ్య, తారక రఘు వీర్, పట్టణ ఉపాధ్యక్షుడు నామెడ గజేందర్, నాయకులు సోమేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీలో మౌలిక వసతుల కల్పకు కృషి
నిర్మల్ అర్బన్, ఆగస్టు 1 : బాసర ట్రిపుల్ ఐటీలో మౌలిక సదుపాయాల కల్పనకు, నాణ్యమైన విద్యా బోధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలో మంత్రిని ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యాలయంలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, బోధన, బోధనేతర అంశాలను మంత్రికి వివరించారు. అనంతరం సమస్యలు పునరావృతం కాకుండా ప్రణాళికల రూపకల్పన, దశల వారీగా అమలు చేయడం, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, కమిటీల ఏర్పాటు తదితర అంశాల గురించి చర్చించారు. విద్యార్థుల భవిష్యత్, వారి ప్రయోజనాలు ముఖ్యమంత్రి మంత్రి ఐకే రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో యూనివర్సిటీని సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రెవెన్యూ అధికారులు ఉన్నారు.