నిర్మల్ అర్బన్, జూలై 5;డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నది. అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం కోర్సుల్లో సీట్లను మూడు ఫేజుల్లో భర్తీ చేయాని నిర్ణయించిన యంత్రాంగం, అనుమానాల నివృత్తికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాల హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కాగా.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.. అన్న సందేహాలపై నమస్తే అందిస్తున్న ప్రత్యేక కథనమిది.
దోస్త్ ద్వారా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం విద్యార్థుల ముందు ఉంచింది. ఇందుకోసం విద్యార్థులు ముందుగానే తమ ఆధార్కు ఫోన్ నంబర్ లింక్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. టీ-యాప్ ద్వారా https://dost.cgg.gov.in విద్యార్థులు లాగిన్ కాగానే వారికి దోస్త్ ఐడీ, పిన్ నంబరు వస్తుంది. వీటిని ఉపయోగించి దరఖాస్తు పూర్తి చేసుకోవాలి. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సెలింగ్లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న కాలేజీకి వెళ్లి ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
సేవా కేంద్రం ద్వారా ఉచిత సేవలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆయా యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో దోస్త్ సేవా కేంద్రాలను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో విద్యార్థులు ఆధార్తోపాటు ఫారం కోసం రూ.200 చెల్లిస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో ఉన్న అధ్యాపకులు రిజిస్ట్రేషన్తోపాటు వెబ్ ఆప్షన్లు కూడా పెడతారు. ఈ క్రమంలో విద్యార్థులకు నచ్చిన కళాశాల ఎంపిక చేసుకునే అవకాశం ఉం ది. అంతేకాకుండా విద్యార్థులు తామే రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రమంలో ఏవైనా తప్పులు జరిగినా ఈ కేంద్రాల ద్వారా సరిదిద్దుకునే చాన్స్ ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం..
దోస్త్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉన్నది. దోస్త్ లాగిన్తో ఆన్లైన్ ఫాం నింపే క్ర మంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వివరాలను చూసుకుని వారికి నచ్చిన, అందుబాటులో ఉండే యూనివర్సిటీలో వాటికి అనుసంధానంగా ఉన్న కాలేజీలో ప్రవేశం పొందవచ్చు.
హెల్ప్లైన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలతోపాటు 27 ప్రైవేట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశం కోసం కాకతీయ యూనివర్సిటీ దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా, మీ సేవా కేంద్రాలు, స్మార్ట్ఫోన్లలో ఇష్టమైన కళాశాలలో చేరవచ్చు. ఆన్లైన్ ద్వారా కళాశాలలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలకు 9963728118 నంబర్ను సంప్రదించవచ్చు.ఫస్ట్ పేజ్ ఈనెల 30 వరకుదరఖాస్తు చేసుకోవచ్చు.
– పీజీ రెడ్డి, దోస్త్ కో-ఆర్డినేటర్, నిర్మల్.
ముఖ్యమైన తేదీలు..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మొబైల్ యాప్ ద్వారా దోస్త్లో నమోదు చేసుకోవచ్చు.హాల్ టికెట్, పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్లు, ఇతర వివరాలు (అభ్యర్థి పేరు, తండ్రి, తల్లి పేరు, లింగం, అభ్యర్థి ఫొటోగ్రాఫ్) నమోదు చేయాలి. అన్ని సవ్యంగా ఉన్నట్లు ధ్రువీకరణ అయితే దోస్త్ ఐడీ సమాచారం వస్తుంది.ఎస్ఎంఎస్, యాప్ ద్వారా దోస్త్ రిఫరెన్స్ ఐడీ, పిన్ సమాచారం వస్తుంది. ఆ తర్వాత దోస్త్ ఆన్లైన్ వెబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్, వెబ్ ఎంపికలను ఉపయోగించుకొని తదుపరి ప్రక్రియ కోసం వెళ్లవచ్చు.రిజిస్ట్రేషన్ రుసుం 200 చెల్లించడం ద్వారా దోస్త్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. తదుపరి దోస్త్ ఐడీ పొందుతారు.
రిజిస్ట్రేషన్ తర్వాత విద్యార్థులకు దోస్త్ ఐడీ, పిన్ వస్తుంది.ప్రవేశ ప్రక్రియ ముగిసే వరకు దోస్త్ ఐడీ, పిన్ను జాగ్రత్తగా, గోప్యంగా ఉంచాలి.
దరఖాస్తు ఫారం తెరవడానికి దోస్త్ ఐడీ, పిన్, పాస్వర్డ్ను ఉపయోగించాలి.
దరఖాస్తు ఫారం నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన అన్ని సరైన వివ రాలతో నింపాలి. ఒక్కసారి వివరాలు సమర్పించిన తర్వాత దానిని సవరించలేం.
ఈ తర్వాత విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు/కోర్సులను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవడం కోసం వెబ్ ఎంపిక చేసుకోవాలి. కాలేజీ, కోర్సు ప్రాధాన్యతలను ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వెబ్ ఎంపిక ఆధారంగానే సీటు వస్తుంది.
అమలులో ఉన్న మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
కేటాయించిన సీటుతో విద్యార్థులు సంతృప్తి చెందితే, వారు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటును ధ్రువీకరిం చుకోవాలి. నిబంధనల ప్రకారం రుసు మును ఆన్లైన్లో చెల్లించాలి.
సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీటును ధ్రువీకరించే విద్యార్థులు కేటాయించిన కళాశాలను సందర్శించి, ధ్రువీకరణ పత్రాలను ప్రిన్సిపాల్కు సమర్పించాలి. కళాశాల రుసుమును చెల్లించాలి. అప్పు డే సదరు విద్యార్థికి సీటు కేటాయించ బడుతుంది.పొందిన సీటుతో విద్యార్థి సంతృప్తి చెందకపోతే, తన సీటు రిజర్వేషన్ కోసం రుసుం (ఆన్లైన్ చెల్లింపు) చెల్లించి తర్వాత, రెండో, మూడో దశలలో వెబ్ ఎంపికల కోసం వెళ్లవచ్చు.
రిజర్వేషన్ల కింద సీట్ల కేటాయింపు కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మీసేవ కుల ధ్రువీకరణ పత్రం (సీఎన్డీ నంబర్, ఉప కులంతో) నమోదు చేయడం తప్పనిసరి. విద్యార్థులు దోస్త్లో నమోదు చేసుకోవడానికి, ఆధార్ నంబర్లో ఏదైనా సరిదిద్దడానికి, సర్టిఫికెట్లను సరైన విధంగా అప్లోడ్ చేయడానికి, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. విద్యార్థి ఇప్పటికే మొబైల్ నంబర్ను ఆధార్కు లింక్ చేసి ఉంటే, నేరుగా తమ ఫోన్కు వచ్చిన ఓటీపీ ద్వారా దోస్త్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ విద్యార్థి మొబైల్ నంబర్ను ఆధార్తో అనుసంధానించి నట్లయితే ఆ విద్యార్థి మీ సేవ కేంద్రానికి వెళ్లి తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలా వివరాలు నమోదు చేయడం ద్వారా మీ సేవ నుంచి దోస్త్ ఐడీతో పాటు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దోస్త్ హెల్ప్లైన్ సెంటర్ను సంప్రదించవచ్చు.