నేరడిగొండ, జూలై 3 : రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలంటే కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని వాంకిడి గ్రా మంలో ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. 70 సం వత్సరాలుగా రాష్ట్రంలో జరగని అభివృద్ధి కేసీఆర్ హయాం లో అయ్యిందని పేర్కొన్నారు. సర్కారు ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తి చేసుకోగా.. ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమం ద్వారా సార్కరు బడుల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిందని పేర్కొన్నారు. దీంతో సర్కారు బడిలో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందనున్నదని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం వాంకిడి పాఠశాలకు రూ.26 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే ను శాలువాతో సన్మానించారు. సర్పంచ్ అడిగం రాజు, ఎం పీపీ రాథోడ్ సజన్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, సర్పంచులు పెంట వెంకటరమణ, కుమ్రం జంగు, జాదవ్ సుభాష్, విశాల్కుమార్, నాయకులు చంద్రశేఖర్ యాదవ్, ఆడెపు రమేశ్, జాదవ్ మహేందర్, ఆత్రం భీంరావ్, మండాడి కృష్ణ, కరణ్సింగ్, ఆడె జనార్దన్, ఎంపీడీవో అబ్దుల్ సమద్, ఎంఈవో అన్రెడ్డి భూమారెడ్డి, వీడీసీ చైర్మన్ మర్ల శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
శుద్ధ జలం అందేలా చూడాలి
వర్షాకాలం మొదలైనందున గ్రామాల్లో తాగునీటి అవసరాలకు శుద్ధ జలం అందేలా చూడాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అధికారులకు సూచించారు. ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్), మిషన్ భగీరథ అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. లీకేజీలు ఉన్న చోట్ల వెంటనే అవసరమైన మరమ్మతులు చేయించాలని పేర్కొన్నారు. నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయించడంతో పాటు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చూడాలన్నారు. అసంపూర్తిగా ఉన్న ట్యాంకుల నిర్మాణాలు వేగవంతం చేయించి పూర్తి చేయించాలని పేర్కొన్నారు. మూడు నెలల పాటు ఇరు శాఖల వారు అప్రమత్తంగా ఉండి తాగు నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ చంద్రమోహన్, డీఈఈలు రమణ, దేవయ్య, తొమ్మిది మండలాల పరిధిలోని ఏఈలు పాల్గొన్నారు.