ఎదులాపురం, జూన్ 27 : ప్రజలు ఇచ్చిన అర్జీ లను తక్షణం పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్ర జావాణిలో భాగంగా సోమవారం ఆమె ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ధరణి, ఉపా ధి, వైద్యం, పింఛన్లు, దళిత బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశాలు, తదితర సమస్యలపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు అర్జీలు అందజేశారు. జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కారానికి త్వరతగతిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆర్డీవో రమేశ్ రాథోడ్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో కిషన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.