సోన్, మే 25 : తెలంగాణ ఏర్పడిన తర్వాతే ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సోన్ మండ లం న్యూవెల్మల్లో రూ.66 లక్షలతో నూతనంగా నిర్మించిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి బుధవారం కేంద్ర మాజీ మంత్రి ఎస్ వేణుగో పాలాచారితో కలిసి హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 500పై చిలుకు దేవాలయాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశా రు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ అంకం గంగామణి, జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీ ఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, సోన్ టీఆర్ ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు టీ వినోద్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఎంపీటీసీ నాగయ్య, నాయకులు వెంకయిగారి శ్రీనివాస్రెడ్డి, అంకం శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, ఆర్డీవో తుకారాం, తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో సాయిరాం, రాంకిషన్రెడ్డి, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
బీరవెల్లిలో..
సారంగాపూర్, మే 25 : మండలంలోని బీరవెల్లి గ్రామంలో మల్లన్న స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారం గాపూర్ మండలంలో 100 నూతన ఆలయాలను నిర్మించామని పేర్కొన్నారు. రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో అడెల్లి దేవాలయాన్ని కృష్ణ శిలలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. బీరవెల్లి మల్లన్న ఆలయం ఎత్తు మీద ఉన్నందున భక్తులకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మెట్లు, సీసీ రోడ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను చూసి వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచ్ రవీంద్రనాథ్, ఎంపీటీ సీ లక్కాడి లయ, కోఆప్షన్ మెంబర్ సయ్యద్ ఇస్మాయిల్, నాయకులు సాగర్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, మధుకర్, లక్ష్మణ్, నవీన్, భూమేశ్, మధుకర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.