ఆదిలాబాద్ రూరల్, మే 25 : ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో పలువురు విద్యుత్ ఉద్యోగులు మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబా లను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ఆదుకుం టుందని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో పని చేస్తూ ప్రమా దవశాత్తు పలువురు మృతి చెందగా, బాధిత కుటుంబాలకు ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో బుధవారం రూ.28 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం వర్తించేలా కృషి చేస్తామన్నారు. టీఆర్ఎస్ అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని ఎమ్మె ల్యే పేర్కొన్నారు. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, ఎంపీపీ గోవర్ధన్, జడ్పీటీసీ వెంకట్రెడ్డి, చంద్రయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.