ఎదులాపురం, మే 25 : ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్ పాత్ర కీలకమైనదని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న కేసుల స్థితిగతులు, వివరాలు తెలుసుకున్నారు. వాటిని సత్వరమే పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. కేసుల దర్యాప్తునందు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు రిజిస్టర్లో పొందుపరచాలని, వాటికి సంబంధించిన విచారణ రిపోర్టును దరఖాస్తుకు జతపరచాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సక్రమంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. లేనిచో వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ సురేందర్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మల్లేశ్, ఎస్ఐ, సిబ్బంది ఉన్నారు.