ఆదిలాబాద్ రూరల్, మే 25 : పట్టణంలోని కాలనీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు కొత్త కుమ్మరివాడలో రూ.10 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణానికి బుధవారం ఆయన భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ త్వరలోనే బతుకమ్మచౌక్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసేలా చూస్తామన్నారు. పట్టణంలోని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాలనీవాసులు మున్సిపల్ చైర్మన్ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీలత, లక్ష్మణ్, ఏఈ అరుణ్; నాయకులు కొండ గణేశ్, మోహన్బాబు, గణపతి, కిష్టన్న పాల్గొన్నారు.