జైనథ్, మే 22: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలం పిప్పర్వాడ, గిమ్మ, గూడ పాఠశాలలో నిర్వహించిన మన ఊరు- మన బడి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల్లో అవసరమైన అన్ని బోధన, బోధనేతర సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో 12 రకాల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మండలంలో మొదటి విడుతలో 22 పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేశామని చెప్పారు.
రెండో విడుతలో మిగతా పాఠశాలలను చేర్చుతామని వివరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే దిక్సుచిగా మారిందన్నారు. పాదయాత్రలు, రచ్చబండల పేరుతో కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని, ప్రజలు మోసకారి పార్టీలను నమ్మే స్థితిలో లేరన్నారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే జోగురామన్నకు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. క్యాక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, జిల్లా డైరెక్టర్ చంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, ఎంఈవో నారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, హెచ్ఎంలు వీరేందర్, మహేందర్, సర్పంచ్లు సంతోష్రెడ్డి, ప్రభాకర్, ఎంపీటీసీ భోజన్న, నాయకులు పాల్గొన్నారు.