చెన్నూర్ రూరల్, ఫిబ్రవరి 15 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని సుద్దాల వాగుపై వంతెన నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ వాగుపై నుంచి కమ్మరి పల్లి, గంగారం, కాచన్పల్లి గ్రామాల ప్రజలు రాకపోకలు సాగి స్తుంటారు. వాగు ఉధృతంగా ప్రవహించినపుడు అవస్థలు పడే వారు. వర్షాకాలంలో అయితే తాత్కాలిక వంతెనపై నుంచి కూడా నీరు ఉధృతంగా ప్రవహించేది. దీంతో ఈ గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. రెండు మూడు రోజులు బయటకు వచ్చే వారు కాదు. అధికారులే నీరు, ఆహా రం అందించేవారు. యేటా ఇదే పరిస్థితి ఉండేది. దాదాపు 50 ఏండ్లుగా బ్రిడ్జి నిర్మించాలని గత ప్రభుత్వాలను కోరినా ఫలితం లేక పోయింది. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం, అనంతరం మరచిపోవడం పరిపాటిగా మారింది. గత ఎన్నికల సమయంలో బాల్క సుమన్ ప్రజల కష్టాలను చూసి చలించిపోయారు. బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు హమీని నిలబెట్టుకున్నారు. వంతెన నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో దశాబ్దాల కల నెరవేరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, విప్ సుమన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.