అడ్రియాల గనిలో మిగిలిన ఇద్దరూ మృత్యువాత
సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ దుర్మరణం
రెస్క్యూబృందం నిరంతరం శమించినా దక్కని ప్రాణాలు
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు
బాధిత కుటుంబాలకు సీఎండీ శ్రీధర్ సంతాపం
గోదావరిఖని/ రామగిరి, మార్చి 9: రామగుండం డివిజ న్లోని అడ్రియాల గని ప్రమాదంలో బొగ్గు పొరల్లో చిక్కుకున్న మిగతా ఇద్దరూ మృతిచెందారు. మంగళవారం రాత్రి డిప్యూటీ మేనేజర్ మృతదేహం దొరకగా, బుధవారం మరో సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ సైతం విగత జీవు లుగా మారి కనిపించారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో గనిలో 86వ లెవల్ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలడంతో ఇద్దరు ఉద్యోగులు, ఏడుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకొన్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సిం గరేణి రెస్క్యూ బృందం రెండు రోజులు శ్రమించి నలుగురిని ప్రా ణాలతో కాపాడిన విషయం తెలిసిందే. అయితే మిగతా ముగ్గురి కోసం అన్వేషిస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి డిప్యూటీ మే నేజర్ తెజావత్ చైతన్య మృతదేహం దొరుకగా, అర్ధరాత్రి ఒం టిగంటకు ఏఎస్వో జయరాజు, తెల్లవారుజామున 5:30 గంటలకు కాంట్రాక్ట్ కార్మికుడు శ్రీకాంత్ మృతదేహాలను వె లికితీశారు. కాగా, తమవారు మృతిచెందారనే వార్త విని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. కాగా, మృతి చెందిన వారిలో ఏరియా సేఫ్టీ అధికారికి రావాల్సిన బెనిఫిట్స్ రూ.2.88 కోట్లతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, డిప్యూటీ మే నేజర్ తేజావత్ చైతన్య తేజ రావాల్సిన రూ.1.08 కోట్లతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిస్తామని యాజమాన్యం ప్రకటించింది.
మృతుల వివరాలివే..
ఎస్ జయరాజు (ఏరియా సేఫ్టీ అధికారి). ఇయన స్వస్థలం విజయవాడ. ఉద్యోగ రీత్యా సెంటినరీకాలనీలోని ఎన్.ఏ-1 క్వార్టర్లో నివాసం ఉంటున్నాడు. భార్య మాణిక్య కుమారి, కుమార్తె హిమవర్ష. ఇక తేజావత్ చైతన్య (డిప్యూటీ మేనేజర్). స్వస్థలం ఖమ్మం జిల్లా పాల్వంచ కాగా, ఉద్యోగరీత్యా యైటింక్లయిన్ కాలనీలో ఉంటున్నాడు. భార్య పూజిత, ఇద్దరు కుమారులు తన్విక్ రాజ్(6), యశీల్ తేజ్ (4)ఉన్నారు. కాం ట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ది పెద్దపల్లి మండలం చందపల్లి.
సింగరేణి సీఎండీ దిగ్భ్రాంతి..
ఏఎల్పీ గని ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడంపై సంస్థ సీఎండీ శ్రీధర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గని ప్రమాదం చాలా బాధాకరమని పేర్కొన్నారు. రక్షణపై ఖర్చుకు వెనుకాడకుండా గనుల్లో చర్యలు తీసుకుంటున్నామనీ, అయినా ఇలాంటి ఊహించని ఘటన జరిగి ముగ్గురిని కోల్పోవడం ఎంతో బాధించిందన్నారు. బాధిత కుటుంబాలకు సంస్థ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. మృతి చెందిన వారికి చెల్లించాల్సిన మొత్తాలను వెంటనే వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామనీ, కుటుంబంలో అర్హులైన వారికి వెంటనే కోరిన చోట ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సంస్థ డైరెక్టర్లతోపాటు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, జాతీయ సంఘాల నాయకులు సంతాపం ప్రకటించారు. గని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులను సింగరేణి అధికారుల సంఘం నాయకులు పరామర్శించి సంతాపం ప్రకటించారు.