ఎదులాపురం, మార్చి 4: ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు వివిధ సంఘాల నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం హెచ్-1 నాయకులు శుక్రవారం ఫారెస్ట్ గెస్ట్హౌస్లో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, సలహాదారుడు రాథోడ్ బాబూలాల్, కోశాధికారి అనిల్, నాయకులు రఘురామారావు, రమణాచారి, అక్బర్, నగేశ్, మోహన్, ప్రమోద్, హెల్త్సెంటర్ సీవోలు నవీన్ కుమార్, రాజారెడ్డి ఉన్నారు.
నియోజకవర్గానికి వెయ్యి కుటుంబాలకు దళితబంధు
నియోజవర్గానికి వెయ్యి కుటుంబాలకు దళితబంధు అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ మంత్రి హరీశ్రావును కోరారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు అడెల్లు, అశోక్, సుద్దాల శివకుమార్ ఉన్నారు.
వేతనాలు పెంచాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ, వసతి గృహాల్లో 30 సంవత్సరాల నుంచి పార్ట్టైంగా పని చేస్తున్న తమకు వేతనాలు పెంచాలని వర్కర్లు మంత్రి హరీశ్రావుకు వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడ జిల్లా గౌరవాధ్యక్షుడు కేబీసీ నారాయణ, జిల్లా అధ్యక్షుడు అశోక్, లక్ష్మి ఉన్నారు.
బదిలీలు చేయాలి
రిమ్స్లో పది సంవత్సరాలుగా పని చేస్తున్న తమను వెంటనే సాధారణ బదిలీలు చేసి ఆదుకోవాలని స్టాఫ్నర్సు, హెడ్నర్సులు మంత్రి హరీశ్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. త్వరలోనే బదిలీలు చేసి ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారు స్టాఫ్నర్సులు విరోనిక, పద్మ, చిన్నమ్మ, తదితరులు ఉన్నారు.
మంత్రికి వినతుల వెల్లువ
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానను పరిశీలించారు. పలువురు తమ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్లో ఉన్న తమ జీతాలు విడుదల చేయాలని నాలుగో తరగతి ఉద్యోగులు విన్నవించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్టీటీఎఫ్ నాయకుడు చంద్రకాంత్, పలు సమస్యలను టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్ మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.