నిర్మల్ అర్బన్, డిసెంబర్19 : గణితంలో పట్టు సాధిస్తేనే అన్ని రంగాల్లో విజయం సాధించవచ్చని నిర్మల్ డీఈవో రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జేవీఎన్ఆర్ విద్యానికేతన్లో సోమవారం గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గణిత పోటీ పరీక్ష నిర్వహించారు. పలువురికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. గణిత అభ్యసనంలో మెళకువలను విద్యార్థులు ఆకలింపు చేసుకోవాలని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచి తార్కిక ఆలోచనకు పదు ను పెడితే గణిత అభ్యసనం సులువుతుందని తెలిపారు. ప్రతిభా పాటవ పోటీలతో చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గణిత ఫోరం అధ్యక్షుడు చట్ల శ్రీనివాస్, సెక్రటరీ మనోహర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, సభ్యులు సాయినాథ్, నరేందర్ రెడ్డి, రవి కాంత్, విజయ భాస్కర్, జిల్లా పరీక్షల అధికారి సిద్ధ పద్మ, ఎంఈవో శంకర్, సెక్టోరియల్ అధికారులు నాగుల రవి గౌడ్, వేల్పూరు నర్సయ్య, ప్రవీణ్, శ్రీదేవి, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి గణిత పోటీ విజేతలు వీరే..
గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా గణిత ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి గణిత పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. పట్టణంలోని జేవీఎన్ఆర్ పాఠశాలలో నిర్వహించి న పోటీల్లో తెలుగు మీడియంలో ప్రథమ బహుమ తి సిద్ధార్థ్ (జడ్పీహెచ్ఎస్, ఝరి), ద్వితీయ బహుమతి ఎం శ్రీనిధి (జడ్పీహెచ్ఎస్, పొన్కల్), తృతీ య బహుమతి పీ స్పందన (జడ్పీహెచ్ఎస్, కొరిటికల్), ఇంగ్లిష్ మీడియంలో ఎం సాయి శృతి (జడ్పీహెస్ఎస్, కొరిటికల్), ఆర్ సాయి హర్షిణి (కొరిటికల్), రిత్విక్ (ఎంజేపీటీ, రాచాపూర్), ఉర్దూ మీడియంలో ప్రథమ ఎండీ అర్ఫత్ (జడ్పీఎస్ఎస్, ముథోల్), తయాబ ఫిరోస్ (జడ్పీఎస్ఎస్, నర్సాపూర్), ముస్కాన్ (నర్సాపూర్) ప్రతిభ కనబర్చా రు. వీరిని గణిత ఫోరం సభ్యులు అభినందించారు.