నార్నూర్, డిసెంబర్ 17 : గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కనక మోతుబాయి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీలు, సర్పంచ్లు సమస్యలను ప్రస్తావించారు. అధికారులు గ్రామాల్లో చేపట్టిన ప్రగతి, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా జడ్పీచైర్మన్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకు తెలియజేసేలా చూడాలన్నారు. మూడు నెలలకు ఒకసారి మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తే సర్పంచ్లు రాకపోతే సమస్యలు ఏలా తెలుస్తాయన్నారు. దశల వారీగా మండలంలోని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో కావల రమేశ్, తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్, వైస్ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఏపీఎం మైస రమేశ్, ఎంఈవో రాపెల్లి ఆశన్న, ఏఈలు జాడి లింగన్న, సుబ్బాని, రాథోడ్ సునీల్, ఏవో గిత్తే రమేశ్, ఎంపీవో స్వప్నశీల, ఆయా శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
జడ్పీ చైర్మన్కు సన్మానం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి ఢిల్లీకి వెళ్లి వచ్చిన సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ఎంపీపీ జాదవ్ చంద్రశేఖ ర్, కోఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, ఎంపీటీసీలు పరమేశ్వర్, జాదవ్ రేణుక, గేడం ఏత్మాబాయి, బాదవత్ కళావతి, సర్పంచ్లు జాదవ్ సునీత, రాథోడ్ విష్ణు, కనక సేవంతాప్రభాకర్ పాల్గొన్నారు.