భీంపూర్, డిసెంబర్17: ఆదిలాబాద్ జిల్లా తాంసిలో నిరుపేద కుటుంబానికి చెందిన కూలీలైన భార్యాభర్తలు కృష్ణవేణి, వసంత్లు రెండేళ్ల వ్యవధిలో అనారోగ్యంతో అకాల మృతి చెందగా వారి ఏకైక కుమారుడు సాయి ఒంటరయ్యాడు. ఈ ఉదంతానికి సంబంధించి ‘అమ్మ అనురాగం అందక- నేడు నాన్న దూరమై’ శీర్షికన ఈ నెల 15న నమస్తే తెలంగాణ జిల్లా అనుబంధంలో ప్రచురితమైన కథనానికి బాలల పరిరక్షణ విభా గం చైల్డ్లైన్ 1098 అధికారులు తక్షణం స్పం దించారు. ప్రొటెక్షన్ అధికారి ఆర్. వినోద్కుమార్, చైల్డ్ లైన్ అధికారి శ్రీకాంత్ శనివారం తాంసికి వెళ్లి సాయి అమ్మమ్మను కలిసి వివరాలు తీసుకున్నారు. వారి దీనగాథను విన్నారు. చైల్డ్లైన్ తరఫున ప్రతినెలా విద్యార్థి చదువు,సంరక్షణకు రూ.2 వేల చొప్పున భృతి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత ధ్రువీకరణ పత్రం సాయి అమ్మమ్మకు అందజేశారు. ఈ విద్యార్థి హైదరాబాద్లోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి విద్యాలయంలో 7 వ తరగతి చదువుతున్నాడు. సాయికి ప్రస్తుతం సంరక్షకురాలిగా ఉన్న వయోవృద్దురాలు శకుంతలకు కూడా సరకులు పంపిణీ చేస్తామన్నారు. అధికారులతో సర్పంచ్ స్వప్న రత్నప్రకాష్, బీసీ యువజన విభాగం మండల అధ్యక్షుడు దారవేణి రాఘవేంద్ర, నాయకులు ఉన్నారు.