ఎదులాపురం,డిసెంబర్16: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం 558 మంది అభ్యర్థులు రాత పరీక్షకు అర్హత సాధించారని ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో 1285 మంది అభ్యర్థులకు గాను 1131 మంది హాజరయ్యారు. 154 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అభ్యర్థులకు ప్రత్యేక సూచనలు చేశారు. పరుగు పందెం, లాంగ్ జంప్లో ఎక్కువ మంది వెనుదిగుతున్నారని, వీటిపై అభ్యర్థులు మరింత దృష్టి సారించాలని చెప్పారు. పరీక్షల్లో అదనపు ఎస్పీ సీ సమయ్జాన్రావు, డీఎస్పీలు వీ ఉమేందర్, వెంకటేశ్వరరావు, ఎస్ ఉపేందర్, సీహెచ్ నగేందర్, ఐ జీవన్ రెడ్డి ఎస్ సుందర్రావు, పోలీస్ కార్యాలయం ఎస్వో యూనుస్అలీ, సూపరింటెండెంట్లు జోసెఫిన్, ప్రభాకర్, కార్యాలయ సిబ్బంది, జిల్లాలోని సీఐ, ఎస్ఐ, ఆర్ఐలు, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్, ట్రాఫిక్, కమ్యూనికేషన్, స్పెషల్ పార్టీ , క్యూఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు.