ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 14 : గిరి యువత కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి సూచించారు. మండలకేంద్రంలోని క్రీడా ఆశ్రమ పాఠశాల, ఐటీఐ కళాశాలను శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీజతో కలిసి బుధవారం సందర్శించారు. ముందుగా క్రీడా పాఠశాలలో వంటగదిలో శుభ్రత, ఆహారప దార్థాలు, కూరగాయలు, భోజనాన్ని పరిశీలించారు. ఈ సం దర్భంగా పీవో మాట్లాడుతూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని వార్టెన్, సిబ్బందికి సూచించారు. ‘అక్షర జ్యోతి’ లో భా గంగా విద్యార్థులకు అందిస్తున్న శిక్షణను సబ్జెక్టుల వారీగా బోధన తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పారిశ్రామిక శిక్షణ సంస్థ కళాశాలను పరిశీలించారు. సివిల్, కంప్యూటర్, స్టెనోగ్రాఫర్, వైండింగ్ వంటి శిక్షణ కోర్సుల వివరాల ను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నలుగురుకి ఉపాధి చూపేలా యువత ఎదగాలని సూచించారు. అదేవిధంగా గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, భవన మరమ్మతులను తక్షణం చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్బాబు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హరిత, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.
ఆధునిక పద్ధతులు పాటించేలా చూడాలి
గిరిజన రైతులు ఆధునిక పద్ధతులు ప్రోత్సహించాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. హార్టికల్చర్ నర్సరీని శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. జామ, టమాట, మిరప, వంకాయతో పాటు పం టలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో నాలుగు ఎకరా ల్లో జా మ మొక్కలు, రెండు ఎకరాల్లో టమాట, బెండ, మరో రెండు ఎకరాల్లో బొప్పాయి నాటామన్నా రు. అలాగే డ్రాగెన్ ఫ్రూట్ నర్సరీ చుట్టూ కాగితపు పరిశ్రమకు అవసరమయ్యే కానుగ మొ క్కలను నాటాలని అధికారులకు సూచించారు. పంటలపై రైతులకు అవగాహన, శిక్షణ కల్పించాలని, వారి ఆర్థిక అభివృద్ధికి ఐటీడీఏ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఐటీడీఏ ఓఎస్డీ కృష్ణయ్య, ఉద్యానవన శాఖ అధికారి సుధీర్, సిబ్బంది శివమూర్తి పాల్గొన్నారు.