ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 9 : మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్, తాటిగూడలో రూ. 30 లక్షలతో చేపడుతున్న రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి శుక్రవారం కౌన్సిలర్ అశోక్ స్వామితో కలిసి మున్సిపల్ చైర్మన్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం సమస్యల పరిష్కార దిశగా వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగు రామన్న కృషితో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి దశకు చేరుకుంటున్నాయని తెలిపారు. పట్టణ అభివృద్ధికి గతంలో ఎంపీ సోయం బాపురావ్ ప్రకటించిన 11 కోట్ల నిధులు ఇప్పటి వరకు రాలేదని అన్నారు. బీజేపీ నాయకులు అభివృద్ధికి సహకరించకుండా విమర్శలు చేయడం తగదని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్ పందిరి భూమన్న, బీఆర్ఎస్ నాయకులు మోసిన్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.