భీంపూర్, డిసెంబర్ 6 : రాష్ట్రంలోని అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి మంగళవారం భీంపూర్ మండలం గోనా గ్రామంలో ప్రకృతివనం, వైకుంఠధామం, సవారీబంగ్లాను ప్రారంభించారు. కుమ్రం భీం విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. భీంపూర్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సొంత స్థలాలు ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. దళితబస్తీలో బోథ్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందన్నారు. పిప్పల్కోటి రిజర్వాయర్తో వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్లు బాదర్,మడావి లింబాజీ, పెండెపు కృష్ణయాదవ్, బీ అజయ్ యాదవ్, నిమ్మ వేణుయాదవ్, కరీం, చిన్ను , కోఆప్షన్ సభ్యుడు జహూర్అహ్మద్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్యయాదవ్, నాయకులు కుడిమెత సంతోష్, జీ నరేందర్యాదవ్, సంజీవ్రెడ్డి ,అనిల్, వైభవ్ , కపిల్, జాదవ్ రవీందర్, ఉత్తంరాథోడ్, పాండురంగ్, జావేద్, గ్రామస్తులు ఉన్నారు.
ఇచ్చోడ, డిసెంబర్ 6 : మండలంలోని జామిడిలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, సర్పంచ్ హారన్ సుభాష్, మాజీ సర్పంచ్ రాథోడ్ సుభాష్,కన్వీనర్ మేరాజ్ మహ్మద్, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, రామేశ్వర్, మారుతి, గోవింద్, ముస్తాఫా, రషీద్, రాథోడ్ ప్రవీణ్, బలగం రవి, గైకాంబ్లీ గణేశ్, అర్గుల గణేశ్, బూతిరాజు, మడావి భీంరావు, సాయం విశ్వనాథ్, రమేశ్, అబ్దుల్ అజీమ్, కన్నమయ్య, గంగయ్య, సుభాష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సూర్యకాంత్ పాల్గొన్నారు.
మన్నూర్లో ఈద్గా నిర్మాణానికి నిధులు
గుడిహత్నూర్,డిసెంబర్ 6:గుడిహత్నూర్ మండలం మన్నూర్లో ఈద్గా నిర్మాణానికి సీడీఎఫ్ నిధుల నుంచి రూ.4లక్షలు మంజూరయ్యాయి. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మంగళవారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంతోషమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, ఏఎంసీ వైస్ చైర్మన్ జంగు,ఎంపీటీసీ న్యాను,మాజీ ఎంపీటీసీ లింగంపెల్లి రాజేశ్వర్, నాయకులు జలంధర్, ఆశన్న యాదవ్, పాటిల్ రాందాస్, సంతోష్గౌడ్, మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు.