ఎదులాపురం,డిసెంబర్6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబ్కేదర్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట అంబేద్కర్ విగ్రహానికి స్వేరోస్ నాయకులు పూలమాలలు వేసి నివాళుర్పించారు. రాష్ట్ర కార్యదర్శి పెంటపర్తి ఊశన్న, మహా బుద్ధ జిల్లా అధ్యక్షుడు సత్యవాన్ చిక్టే, నాయకులు పసుల సంతోష్, ఉత్తం కాంబ్లే ఉన్నారు. దస్నాపూర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కౌన్సిలర్ భరత్ కుమార్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు కాంబ్లే అనిల్ , టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు దివిటి రాజు, రమాబాయి మహిళా విభాగం మండల అధ్యక్షురాలు జాబడే సులోచన, సభ్యులు పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో అన్నాబావు సాఠే అసొసియేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాంబ్లే ఉద్ధవ్, ఉపాధ్యక్షుడు భట్లాడే సూర్యకాంత్, కార్యదర్శి డీకే నాందేవ్, నాయకులు అర్జున్, జ్ఞానోబా, రాజ్, సూర్యకాంత్, సచిన్, టీఎమ్మార్పీఎస్ నాయకులు గంగాధర్, రవి గద్వాలే తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నవీన్ కుమార్, మాణిక్రావు, ఉద్యోగులు చిట్ల గంగాధర్, పూర్ణ చందర్, ఉష్కం శంకర్, ప్రశాంత్ కుమార్, కవిత, రుబియా, గణేశ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్కు నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేశ్, సేవాదళ్ జిల్లా చైర్మన్ భేదోడ్కర్ మోతీరాం పాల్గొన్నారు. మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అల్లూరి భూమన్న, ప్రధాన కార్యదర్శి దాసరి బాబన్న, నాయకులు మల్లన్న, నిమ్మల ప్రశాంత్, రాళ్లబడి శంకర్, శశికాంత్, కిరణ్సాయి బాబాతగరి భాస్కర్ , బ్రహ్మ శ్రీనివాస్, వరప్రసాద్ ఉన్నారు.
తాంసి, డిసెంబర్ 6: తాంసి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి జడ్పీటీసీ తాటిపెల్లి రాజు నివాళి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల కన్వీనర్ తారుడి అరుణ్కుమార్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కంది గోవర్ధన్రెడ్డి, సర్పంచ్ కృష్ణ, నాయకులు నాగారెడ్డి, గంగారాం, రఘు, నరేందర్, పొచ్చన్న, స్వామి, పాల్గొన్నారు. పొన్నారి, కప్పర్ల, బండలనాగాపూర్, జామిడి, గోట్కూరి, సవర్గాం గ్రామాల్లో నివాళులర్పించారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు సంజీవ్రెడ్డి, భరత్, వెంకన్న, సదానందం, కేశవ్రెడ్డి, ఎంపీటీసీలు ముచ్చరేఖ, అశోక్ పాల్గొన్నారు.
జైనథ్, డిసెంబర్ 6: మండలంలోని పెండల్వాడలో అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, ఎంపీటీసీ అశోక్, నాయకులు కిషన్, సురేశ్ పాల్గొన్నారు.
బేల,డిసెంబర్6 : మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలు, గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. మనియార్పూర్లో ఎంపీపీ వనితా ఠాక్రే పంచశీల జెండా ఎగుర వేశారు. సర్పంచ్ వాడ్కర్ తేజ్రావు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, ఎమార్పీఎస్ మండల అధ్యక్షుడు కృష్ణపెళ్లి అంకూస్, నాయకులు యమూర్లవార్ గణేశ్, జిలేందర్, నరేశ్, భూమన్న పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, డిసెంబర్6: మండలకేంద్రంతోపాటు సట్వాజిగూడ, శంకర్గూడ, బుర్సన్పటార్, మర్కాగూడలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మండల ప్రజాప్రతినిధులతోపాటు వివిద పార్టీల నాయకులు, అధికారులు, దళితులు ఫూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, యూనియన్ బ్యాంకు మేనేజర్ గౌరవ్ భగత్, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, మడావి భీంరావ్, ఈవో సంజీవరావ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మసూద్, గ్రంథాలయ అధికారి కాంబ్లే వెంకటి, మాజీ సర్పంచ్ సుంకట్రావ్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, నాయకులు దేవ్పూజె మారుతి, మరప రాజు, రాజలింగు, పోటే సాయినాథ్, ఉపాధ్యాయులు రాథోడ్ అనిల్, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకట్రావ్, శివాజీ, దిలిప్మోరే, లహుదాస్, ఉత్తం కాంబ్లే, భావ్రావ్, రాజ్వర్ధన్, సత్యానంద్, శుద్ధోధన్, దత్తా, కామ్రాజ్, కిషన్, నాగోరావ్, దళితానంద్ పాల్గొన్నారు.
నార్నూర్,డిసెంబర్6: నార్నూర్లోని త్రిరత్న బుద్ధవిహార్లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో నార్నూర్ పీఏసీఎస్ చైర్మన్ ఆడే సురేశ్, ఎంపీటీసీ టీ పరమేశ్వర్, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు లొకండే చంద్రశేఖర్, డైరెక్టర్ దుర్గే కాంతారావు, విద్యావేత్త బాలాజీకాంబ్లే, సమాజ పెద్దలు దుర్గే గుణవంత్ రావ్, నాయకులు రాథోడ్ ఉత్తమ్, సయ్యద్ఖాసిం, కొరల మహేందర్, సునీల్, కేశవ్, గణేశ్ ఉన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు,విద్యార్థులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 6: ఐక్యమాల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఆర్డీవో కదం సురేశ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవోను నాయకులు సన్మానించారు. తహసీల్దార్ భోజన్న, ఆదిలాబాద్ మాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అల్లూరి భూమన్న, బాబన్న, ఐక్యమాల సంఘం అధ్యక్షడు బొనకంటి సుభాష్, నాయకులు అర్జన్న, చంద్రకాంత్, లచ్చన్న, పురుషోత్తం, గంగన్న, మల్లేశ్, సంజీవ్ ఉన్నారు.
బోథ్, డిసెంబర్ 6: మండల కేంద్రంతో పాటు సొనాల, కన్గుట్ట, ధన్నూర్ (బీ) గ్రామాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ జీ సురేందర్ యాదవ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కే ప్రవీణ్, పసుల చంటి, భీంరావు, రమేశ్, జక్కుల వెంకటేశ్, వివిధ పార్టీల నాయకులు, అంబేద్కర్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, డిసెంబర్ 6 : మాల సంఘంతో పాటు వివిధ సంఘాల నాయకులు మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. పంచశీల ధ్వజారోహణం, బుద్ధ వందన కార్యక్రమంచేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఈవో రాథోడ్ ఉదయ్రావు, బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండలాధ్యక్షుడు, నర్వాడే రమేశ్, కార్యదర్శి కృష్ణకుమార్, బౌద్ధ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు భగత్ కాశీనాథ్, నాయకులు ఖిల్లారే అరుణ్, గైక్వాడ్ ధమ్మపాల్, బొజ్జా రవి, జితేందర్ పవార్, నర్వాడే సంజీవ్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్,డిసెంబర్ 6 : గుడిహత్నూర్లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ సునీత, గేడం విజయ్, సిద్ధార్థ్ ససానే, మాధవ్ మస్కే, బుద్దె కిషన్, దమ్మానంద్, సుధాకర్, బబన్, భీం టైగర్ యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
నేరడిగొండ, డిసెంబర్ 6: మండలంలోని తేజాపూర్, నేరడిగొండ, కుమారి, తర్నం, వాంకిడి, వడూర్, కుప్టి, యాపల్గూడ, కొర్టికల్ తదితర గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేరడిగొండ సాయిచైతన్య డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ రాజ్కిరణ్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో సర్పంచ్లులు రాజు యాదవ్, గాదె సమత, విశాల్కుమార్, రాజు, కుమారి పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, అధ్యాపకులు, నాయకులు గాదె శంకర్, వీడీసీ సభ్యులు, అంబేద్కర్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.