ఇచ్చోడ, నవంబర్ 29 : విద్యార్థుల్లో చదువుతోపాటు కళ, ప్రదర్శనల్లో పోటీతత్వం ఉన్నప్పుడే ఉన్నత శిఖరానికి ఎదుగుతారని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని టీటీడబ్ల్యూయూఆర్జేసీలో ఇగ్నైట్ ఫెస్ట్ను కళాశాల ప్రిన్సిపాల్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన చిత్రకళ, సైన్స్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్ట్ వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేకమైన కళ దాగి ఉంటుందని, వాటిని ఉపాధ్యాయులు వెలికి తీయాలన్నారు.
ప్రతిరోజూ యోగా చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్ మాట్లాడుతూ.. రెండు రోజులు ప్రాంతీయస్థాయి ఇగ్నైట్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. 13 విద్యాసంస్థల నుంచి 1600 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. వీరికి ఉపన్యాస, వ్యాసరచన, రంగవల్లులు, యూత్ పార్లమెంట్, మోడల్ యునైటెడ్ నేషన్స్ నైపుణ్యాలపై పోటీలు ఉంటాయని తెలిపారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పద్మ శ్రీ డాక్టర్ కిరణ్ సెథీ కశ్మీర్ నుంచి కన్యాకుమారికి సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు ఆయనను ఇగ్నైట్ ఫెస్ట్కు ఆహ్వానించారు. ఆయనను పీవో వరుణ్రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీవో గంగాధర్, ప్రిన్సిపాల్ రాంప్రసాద్, అధ్యాపకులు వెంకట్ రెడ్డి, మారుతి శర్మ, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
తుకారాంను ఆదర్శంగా తీసుకోవాలి
ఉట్నూర్ రూరల్, నవంబర్ 29 : స్వర్గీయ మడావి తుకారాంను ఆదర్శంగా తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు అన్నారు. మండలంలోని ఎక్స్రోడ్ వద్ద తుకారాం 25వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మడావి తుకారాం ఆదివాసుల్లో ఉన్నత చదువులు చదివి కలెక్టర్గా ఎదిగాడని పేర్కొన్నారు. ఆయన ఆదివాసుల్లో మొట్టమొదటి కలెక్టర్గా ఎదగడం గర్వకారణమన్నారు. ఆదివాసులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తు కారాం కుటుంబ సభ్యులు, ఎంపీపీ పంద్ర జైవంత్రావు, జడ్పీటీసీ చారులత రాథోడ్, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, జిల్లా సార్మేడి మెస్రం దుర్గు, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్, వెడ్మ బొజ్జు, పెందూర్ ప్రభాకర్, వివిధ సం ఘాల, రాజకీయ, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.