ఎదులాపురం, నవంబర్ 25 : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. వార్డ్వాచ్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీలో శుక్రవారం ఆయన పర్యటించారు. కాలనీలో కాలినడకన తిరుగుతూ వార్డులో సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలో చేపట్టిన రోడ్డు మరమ్మతు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగు రామన్న కృషితో కేఆర్కే కాలనీలో నీటి ఎద్దడి, కరెంట్ సమస్యలు తొలగించామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక నిధులు కేటాయించడంతో కాలనీలో అభివృద్ధి దిశగా పనులు జరుగుతున్నాయన్నారు. రూ.8కోట్లు కేటాయించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. సీసీ, బీటీ రోడ్డు, డ్రైనేజీ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. అనంతరం కాలనీ వాసులు మున్సిపల్ చైర్మన్ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్ అంజుబాయి, మాజీ ఎంపీటీసీ సంతోష్, నాయకులు ఆశన్న, రాజు, రేఖ సుబేదా, సురేఖ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం
కేఆర్కే కాలనీకి చెందిన రాన్మలే సాయబై ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడంతో నిస్సాహితులుగా మారిన పేద కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.