నిర్మల్ అర్బన్, నవంబర్ 25 : అర్హులైన నిరుపేదలకే డబుల్బెడ్రూం ఇండ్లను అందిం చామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 42 వార్డుల్లో 1726 మందిని అర్హులుగా గుర్తించి వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించారు. పట్టణంలోని దివ్య గార్డెన్లో ఏర్పాటు చేసిన అర్హులైన వారందరికీ కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. దీంతో పాటు పట్టణంలోని రాజరాజేశ్వర గార్డెన్, తిరుమల గార్డెన్లో వార్డుల వారీగా గుర్తించి ఇండ్లను కేటాయించారు. ఉద యం నుంచే లబ్ధిదారులు పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా లబ్ధిదా రులను గుర్తించి వారిని మాత్రమే లోనికి అనుమ తించి ఇండ్లను కేటాయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, హేమంత్ బోర్కడే, తహసీల్ధాన్ సుభాష్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.