దిలావర్పూర్, నవంబర్ 8 : రైతులను ప్రోత్సహిస్తూ పంటలకు గిట్టు బాటు ధరతో పాటు రైతుబంధు పథకం ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని కాల్వలో బన్సపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో, రాంపూర్లో డీసీఎంస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. అనంతరం అక్కడే జిల్లాలోనే మొట్టమొదటి సారిగా చైతన్య మండల సమాఖ్య 25 శాతం సబ్సిడీతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రైతుల అభ్యున్నతికి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. రైతులు పంట మార్పిడి పద్ధతులు పాటించాలని, అప్పుడే మార్కెట్లో గిట్టుబాటు ధర వస్తుందని చెప్పారు. ఆయిల్పామ్ సాగుపైనా దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నదని చెప్పారు.
మహిళ ఆర్థిక స్వావలంభనకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తున్నదని చెప్పారు. అనంతరం కాల్వ గ్రామంలో మార్కండేయ ఆలయ నిర్మాణానికి రూ. 20లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రిని పద్మశాలీ సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ అడెపు తిరుమల, బన్సపల్లి పీఏసీఎస్ చైర్మన్ పీవీ రమణారెడ్డి, ఎంపీపీ పాల్దే అక్షర, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్రావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, సభ్యులు ఏలాల చిన్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, తహసీల్దార్ కరీం, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్ఖాన్, రైతు సేవా సహకార సంఘం ఉపాధ్యక్షుడు దుప్పి సాయన్న, ఐకేపీ ఏపీఎం సులోచనారెడ్డి, పీఏసీఎస్ సీఈవో సుకుమార్, మండల ఉపాధ్యక్షుడు బాబురావు, ఆలయ కమిటీల చైర్మన్లు భుజంగ్రావు,నిమ్మ చిన్నయ్య, సర్పంచ్ గంగారెడ్డి, నాయకులు అడెపు శ్రీనివాస్, పాల్దే అనిల్, పాల్దే శ్రీనివాస్, ఓడ్నం కృష్ణ, గోవిందుల మహేశ్, ఊజారం మహేశ్, స్వామి,అధికారులు పాల్గొన్నారు.