ఆదిలాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ) : ఆదిలా బాద్ జిల్లాలో 17 మండలాల పరిధిలో 468 గ్రామ పం చాయతీలు ఉన్నాయి. 1.76 లక్షల జాబ్కార్డులు ఉండ గా.. క్రమంగా 2.31 లక్షల మంది కూలీ పని చేస్తున్నారు. డిసెంబర్ నుంచి మే వరకు పనులకు వెళ్తుంటారు. ఉపాధి పథకంలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న వివిధ రకాల పనులు రైతులు, స్థానికులకు ప్రయోజనం చేకూరుస్తు న్నాయి. యేటా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అ వసరమైన పనులను గుర్తించి, అందుకు అయ్యే ఖ ర్చు లను అంచనా వేస్తారు. అనంతరం ఆమోదం తర్వా త పనులు చేపడుతారు. గతేడాది జిల్లాలో ఉపాధి హామీ కూ లీలకు 36.54 లక్షల పని దినాలు కల్పించాల్సి ఉండగా.. 29.61 లక్షల పనిరోజులు కల్పిం చారు. 1.42 లక్షల మంది కూలీలకు ఉపాధి దొరికింది. ఇందుకు రూ. 57. 23 కోట్లు చెల్లించగా.. రూ.21 కోట్ల మెటీరియల్ కింద వెచ్చించారు. ప్రతి కూలీకి రోజు సగటున రూ.187 గిట్టు బాటు అయింది. యేటా వేసవిలో రోజు 50 నుంచి 60 వేల మంది ఉపాధి హామీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతారు. పల్లెల్లో ఎక్కడ చూసినా గుంపులు, గుం పులుగా కూలీలు దర్శనమిస్తారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వీరికి పనులు కల్పించేలా చూడడంతోపాటు వేతనాలు కూడా పంపిణీ జరిగేలా చూస్తారు.
కూలీల ఉపాధిపై వేటు
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూలీల పొట్టగొట్టే చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ప్రతి పంచాయ తీలో 20కి మించకుండా పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది 21 వేల పనులు చేపట్టాలని అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఇప్పటివరకు 17 వేల పనులు పూర్తి కాగా 4 వేల పనులు కొనసాగుతున్నాయి. యేటా ఒక్కో గ్రామంలో సగటున 40 పనులు చేపడుతారు. దీంతో గ్రామంలో కూ లీలకు ఉపాధి లభిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రూపొం దించిన కొత్త నిబంధన కూలీలను ఉపాధి పనులకు దూ రం చేయన్నాయి. కొత్త నిబంధన ప్రకారం ఒక గ్రా మం లో ఏకకాలంలో 20 పనులకు మించి చేయరాదు. గ్రా మంలో 20 పనులు మాత్రమే కొనసాగించాలనే నిబం ధనలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన నేపథ్యం లో ఉపాధి కూలీల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. 20 23-24 ఆర్థిక సంవత్సరానికి గ్రామాల్లో లేబర్ బడ్జెట్ త యారీతోపాటు చేపట్టే పనుల కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బీజేపీ సర్కారు లక్షల మందికి ప్ర యోజనం చేకూర్చే ఉపాధి హామీ పథకాన్ని నీరు గారుస్తున్నదని వారు అంటున్నారు.