ఖానాపూర్టౌన్, అక్టోబర్ 29: శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. కడెం మండలం ధర్మాజీపేట గ్రామంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రతి ఇంటిలో సోదాలు చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 56 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, 2 టాటా మ్యాజిక్లను స్వాధ్వీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు వారి వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ సర్కిల్ సీఐ అజయ్బాబు, ఎస్ఐలు కోసన రాజు, శంకర్, జ్యోతిమణి, పోలీస్ సిబ్బంది పాల్లొన్నారు.
అసాంఘిక శక్తులకు సహకరించొద్దు
అసాంఘిక శక్తులకు సహకరించవద్దని పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. పట్టణంలోని అబుబాకర్ మజీద్ కాలనీలో శనివారం పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వ్యసనాలకు బానిసకావద్దన్నారు. తమ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలన్నారు. అపరిచుతులను నమ్మి సమాచారాన్ని ఇవ్వద్దన్నారు. పట్టణంలో అనుమానంగా ఎవరైనా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతలను కాపాడడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రజల్లో భరోసా కల్పించేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 78 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.