ఇంద్రవెల్లి, అక్టోబర్ 29 : ఆదివాసీల సంస్కృ తీ సంప్రదాయాలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నదని మాజీ ఎంపీ గొడాం నగేశ్ పేర్కొన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని 62 గ్రామాలకు చెందిన దండారీలకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రోత్సా హక ఆర్థిక సాయం రూ. 10 వేలను శనివారం మాజీ ఎంపీ ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్తో కలిసి గ్రామ పెద్దలకు అందించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఆదివాసీల సంస్కృతీతోపాటు కుల దేవత ఉత్సవాలను ప్రభుత్వాలు గుర్తించలేదని కేవలం తెలంగాణలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింద ని పేర్కొన్నారు. ఏజెన్సీలో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుం టున్నదన్నారు. ఆదివాసీల కుల దేవత ఆలయాల అభి వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ఆదివాసీ పిల్లలు విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్నారు.
అనంత రం ఆదివాసీ గిరిజన పెద్దలు శాలువాతో మాజీ ఎంపీ గొడాం నగేశ్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్కు సన్మానిం చారు. ఆదివాసీ పెద్దలతో కలిసి సహపంక్తి భోజ నం చేశారు. ఎంపీపీ పోటే శోభా బాయి, పీఏసీ ఎస్ చైర్మన్ మారుతీ పటేల్డోంగ్రే, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, నాగోబా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మెస్రం తుకారాం, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు షేక్ సుఫియాన్, కనక హనుమంత్రావ్, సుంగుపటేల్, కోరెంగా సుంక ట్రావ్, సాయినాథ్, సోయం భీంరావ్, కుమ్రం రాంషావ్, సర్పంచ్లు మోహన్ రావ్, నాగోరావ్, మడావి బాపురావ్, తుంరం లక్ష్మణ్, మడావి షేకు, గ్రామాల పెద్దలు మెస్రం వెంకట్రావ్ పటేల్, వేట్టి రాజేశ్వర్ పటేల్, పెందూర్ భగ్వంత్ రావ్ పటేల్, కోరెంగా శంభు పటేల్, హెచ్కే జంగుపటేల్ పాల్గొన్నారు.