మంచిర్యాల ఏసీసీ, అక్టోబర్ 28 : మంచిర్యాల జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు అనుమతి లభించింది. మొదటి సంవత్సరంలో 100 సీట్లకు అడ్మిషన్లు చేసుకోవచ్చని జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) డైరెక్టర్ సంజయ్రావ్ నుంచి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేశామని, త్వరలోనే అడ్మిషన్లు పూర్తిచేసి తరగతులను ప్రారంభిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ దావుద్ సులేమాన్ తెలిపారు.
మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతులు రావడంపై కాలేజ్రోడ్డులోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య ఆధ్వర్యంలో శ్రేణులు సంబురాలు చేశారు. ప టాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి వల్లే మెడికల్ కళాశాల మంజూరైందని, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజయ్య మాట్లాడుతూ ఈ ఏడాది అడ్మిషన్లు, తరగతులు జరగవన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచన మేరకు ఎంపీ వెంకటేశ్నేతాకాని, ఎమ్మెల్యే దివాకర్రావు గత నె లలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యద ర్శి రాజ్ భూషన్ను కలిశారని గుర్తు చేశారు. మంచిర్యాల ఎమ్మె ల్యే రూ.165 కోట్లతో అంతర్గాం బ్రిడ్జి నిర్మాణానికి తనవంతు కృషి చేశారన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్కు కృతజ్ఞతలు తెలిపి.. స్వీట్లు తినిపించారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కౌన్సిలర్లు, నాయకులు, ్ట కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా లో ప్రభుత్వ మెడికల్ కళాశాల సాధించిన సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ను మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లే భూమేష్ శాలువాతో సన్మానించి, మిఠాయి తినిపించి, పూల మొక్కను అందజేశారు.